Don't Miss!
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
'దూకుడు'మాత్రమే గూగుల్ సెర్చింగ్ లో...
మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు మరో రేర్ రికార్డుని సొంతం చేసుకుంది. దూకుడు చిత్రం మాత్రమే గూగుల్ టెన్ మోస్ట్ సెర్చెడ్ ఫిల్మ్స్ ఇన్ ఇండియా లిస్ట్ లో చోటు చేసుకున్నది. ఈ చిత్రం ర్యాంక్ తొమ్మిది. సౌతిండియా నుంచి అజిత్ గాంబ్లర్ చిత్రం ఎంపికైంది. ఆ చిత్రం ఏడవ ప్లేస్ లోకి వచ్చింది. ఇక ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ చిత్రం. అలాగే షారూఖ్ ఖాన్ రావన్ చిత్రాన్ని ఇది బీట్ చేసింది. ఇక డిల్లీ భెల్లి,సిగం,హర్రీ పోటర్ చిత్రాలు ఐదు లోపలే ఉన్నాయి. ఇక దూకుడు చిత్రం రికార్డు కలెక్షన్స్ తో సక్సెస్ అవ్వటంతో ఈ చిత్రం గూగుల్ సెర్చింగ్ చోటు దొరికింది. ఇక ఈ సంవత్సరం ఎక్కువగా గూగుల్ లో సెర్చింగ్ చేసిన భారతీయులలో కత్రినాకైఫ్ మొదటి ప్లేసులో ఉన్నారు.
ఆ తర్వాత ప్లేస్ లో అన్నా హజారే వచ్చారు. ఈ 2011 సంవత్సరంలో గూగుల్ సెర్చింగ్ ద్వారా ఏయే వ్యక్తుల గురించి,ఏయే అంశాలు గురించి నెటిజన్లు ఎక్కువ వెతికారు అన్న లెక్కల జాబితాను గూగుల్ విడుదల చేసింది. అందులో కరీనా కపూర్ ని దాటి కత్రినా మొదటి ప్లేస్ కి వచ్చింది. అలాగే అన్నాహజారే సైతం మిగతా వారికి పోటికి నిలిచి సెకెండ్ ప్లేస్ లో నిలిచారు. అలాగే అతి వేగంగా వార్తల్లో పైకెదిగిన వ్యక్తిగా సైతం అన్నా హజారేనే నిలిచి రికార్డు క్రియేట్ చేసారు. ఇక మూడవ ప్లేస్ లో మోడల్ పూనమ్ పాండే ఉంది.