twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేలో 'ఊహా చిత్రం'

    By Staff
    |

    Ooha Chitram
    వంశీకృష్ణ, కావేరీ ఝా జంటగా లిఖిత్‌ ఆర్ట్స్‌ పతాకంపై సత్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ పైడిబాబు నిర్మిస్తున్న 'ఊహాచిత్రం' పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలలో ఉంది. ఈ నెలాఖరుకి తొలి కాపీ సిద్ధమవుతుందని, మే రెండవ వారంలో విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. 'రొటీన్‌ సినిమాలకు భిన్నంగా మా చిత్రం ఉంటుంది. యూత్‌ ని, క్లాస్‌ ఆడియన్స్‌ ని ఆకట్టుకునే అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి.

    దర్శకుడు సత్య చిత్ర కథని కొత్త పంథాలో చెప్పడమే కాకుండా అదే విధంగా సినిమాగా మలిచాడు కూడా. సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. శివ ఆర్‌.నందిగామ్‌ ని సంగీతదర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.

    ఆకట్టుకునే బాణీలతో పాటలను స్వరపరచడయే కాకుండా రీరికార్డింగ్‌ కూడా అద్భుతంగా చేశాడు. ఎలాంటి ఇమేజ్‌ లేని నటుడు హీరోగా నటిస్తేనే కథకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయంతో వర్ధమాన నటుడు వంశీకృష్ణను హీరోగా ఎన్నుకున్నాం. కావేరి గ్లామర్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుంది' అన్నారు నిర్మాత పైడిబాబు. డా.పెద వీర్రాజు ఈ చిత్రానికి సమర్పకుడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X