Don't Miss!
- Sports PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం Video
- News తల పట్టుకున్న మాజీ ప్రధాని, మోదీ మాట వింటారా ?, ఫ్యామిలీ సమస్యలతో ఆ సీటు గోవిందా ?
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు శుభవార్త.. ఈ సారి జీతాల పెంపు ఎంత శాతమంటే..??
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
బాలకృష్ణ, ఎన్టీఆర్ లలో ఎవరోఒకరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే
దసరా సీజన్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న బాలయ్య శ్రీరామ రాజ్యం. జూ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి" చిత్రాలతో నందమూరి హీరోలు బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ పోటీ పడనున్నారు. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల చిత్రాలు కొద్ది రోజుల వ్యవధిలో విడుదలవడం మంచిది కాదనే నమ్మకం ఇండస్ట్రీలో ఉన్నా కానీ ఈ రెండు చిత్రాలు అదే సమయానికి విడుదలకి సమయాత్తమవుతున్నాయి.
ముందుగా ప్లాన్ చేసుకొని షెడ్యూల్స్ కావడంతో ఈసారి పోటీ అనివార్యమవుతోంది. గతసంవత్సరంలో దసరాకి విడుదలైన బృందావనం సెలవుల వల్ల బాగా లాభపడడంతో జూ ఎన్టీఆర్ తన ఊసరవెల్లి చిత్రాన్ని కూడా అదే సీజన్ లో విడుదల చేసుకోవడానికి ముందు నుంచీ ప్లాన్ చేసుకుంటున్నాడు. అదే విధంగా బాలకృష్ణ నటించిన భక్తిరస చిత్రం 'శ్రీరామ రాజ్యం" కి కూడా అదే తగిన సమయమని నిర్మాత నమ్ముతూ ఉండడంతో దసరా సీజన్ లోనే ఇది కూడా విడుదల కానుంది. ఒకవేళ బాబాయ్, అబ్బాయ్ లలో ఎవరూ కాంప్రమైజ్ కాకపోతే నందమూరి అభిమానులకి దసరా సీజన్ లో ఎటువైపు మొగ్గాలనే విషయంలో సందిగ్దం తప్పదనిపిస్తోంది.