Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాన్ బ్రాహ్మిణ్స్ కే ప్రిఫెరెన్స్ ఇస్తాను...గాయని పి.సుశీల
ప్రముఖ గాయని పి.సుశీల డబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 అడుగుపెట్టిన సందర్భంగా తమిళనాడు,ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ లను ఓ కోరిక కోరారు. ఆమె మాటల్లోనే అది...నేను నా సొంత డబ్బుతో...పెద్ద సంగీత పాఠశాలలను హైదరాబాద్, చెన్నైలలో స్ధాపిస్తాను. అందుకు మీరు నాకు ధన సాయం చేయనక్కర్లేదు. అయితే గవర్నమెంట్ మిగతా ఫర్మిషన్స్ విషయంలో నాకు సపోర్ట్ చేయాలి. అలాగే నేను బ్రాహ్మణులు కానివారికే ఈ పాఠశాలలో ప్రాదాన్యత ఇస్తాను. వారిలో సంగీత పట్ల అభిరుచిని, జ్ఞానాన్ని పెంచుతాను అన్నారామె. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో వేలాది పాటలు పాడిన సుశీలకు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా రెండుసార్లు 1969లో, 1971లో తమిళ చిత్రాల్లో పాడినందుకు స్వీకరించారు. ఆంధ్రాయూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి 'కలైమామణి' బిరుదు అందుకున్నారు. ఎన్నో పాటలు పాడిన సుశీలకు చక్రవాకంలోని 'వీణలోనా..' పాట అంటే చాలా ఇష్టం.