శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ రిలీజ్ డేట్ ఖరారు!
హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'పడి పడి లేచే మనసు'. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో రిలీజ్ డేట్ ఫైనల్ చేశారు.
డిసెంబర్ 21న క్రిస్మస్ హాలీడే్స్ సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువశాతం కలకత్తాలో జరిగింది. అనంతరం నేపాల్లో కొన్ని సీన్లు చిత్రీకరించారు. యూత్ను ఆకట్టుకునే ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ ఉండబోతోంది.

"డైరెక్టర్ హను రాగవపూడి మాంచి ప్రేమకథతో మీ ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సాయి పల్లవి ఈ సినిమాలో చూడముచ్చటగా కనిపించబోతున్నారు. మురళి శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం, జయకృష్ణన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అవుతాయి' అని చిత్ర బృందం తెలిపింది.
నటీనటులు:
శర్వానంద్, సాయి పల్లవి,మురళి శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియ రామన్.
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: హను రాగవపూడి
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
కెమెరామెన్: జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: ఏ. శేఖర్ ప్రసాద్
కొరియోగ్రఫీ: రాజు సుందరం
లిరిక్స్: కృష్ణ కాంత్


Click it and Unblock the Notifications











