Don't Miss!
- News 527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు-జాబితాలో ఇవే- ఈయూ గుర్తింపు..!
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పద్మ అవార్డ్స్: మోహన్లాల్కు పద్మ భూషణ్, తెలంగాణ నుంచి సిరివెన్నెలకు పద్మశ్రీ, ఇంకా..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఈ సారి మొత్తం 4 పద్మవిభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.
ప్రముఖ సినీ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి(తెలంగాణ నుంచి) సహా సినిమా రంగం నుంచి మొత్తం ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకా... చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక(ఆంధ్రప్రదేశ్), రైతు నేస్తం ఫౌండేషన్ వ్యస్థాపకుడు యడ్లపల్లి వెంటేశ్వరరావు(ఆంధ్రప్రదేశ్), స్పోర్ట్స్-ఫుట్ బాల్ విభాగంలో సునీల్ ఛెత్రి(తెలంగాణ)కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
మోహన్ లాల్కు పద్మ భూషణ్
ప్రముఖ సినీ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్కు ఆర్ట్-యాక్టింగ్-ఫిల్మ్ విభాగంలో కేరళ నుంచి పద్మ భూషణ్ దక్కింది.
తెలంగాణ నుంచి సిరివెన్నెలకు పద్మశ్రీ
తెలంగాణ రాష్ట్రం తరుపున ఆర్ట్స్-లిరిక్స్ విభాగంలో పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రికి పద్మశ్రీ అవార్డు దక్కింది.
ప్రభుదేవాకు పద్మశ్రీ
ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాకు ఆర్ట్-డాన్స్ విభాగంలో కర్నాటక నుంచి పద్మశ్రీ అవార్డు దక్కింది.
మనోజ్ భాజ్పాయ్
మహారాష్ట్ర నుంచి నటుడు మనోజ్ భాజ్పాయ్ ఆర్ట్-యాక్టింగ్-ఫిల్మ్ విభాగంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
శంకర్ మహదేవన్
మహారాష్ట్ర నుంచి ఆర్ట్-వోకల్స్-ఫిల్మ్ విభాగంలో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్కు పద్మశ్రీ పురస్కారం వరించింది.
శివమణి
ఆర్ట్-మ్యూజిక్ విభాగంలో తమిళనాడు నుంచి ప్రముఖ వాయిద్యకారుడు శివమణి పద్మశ్రీకి ఎంపికయ్యారు.
ఖాన్ ఖాన్
ఇటీవల మరణించిన ప్రముఖ బాలీవుడ్ సినీయర్ నటుడు ఖాదర్ ఖాన్ పేరు కూడా పద్మశ్రీ అవార్డ్స్ లిస్టులో ఉంది.