Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇంటికి రాను అని చెప్పడంతో నటిని కాల్చి చంపిన భర్త
భర్తతో గొడవల కారణంగా ఓ ప్రముఖ నటి హత్య చేయబడ్డ ఘటన వాయువ్య పాకిస్థాన్లో బుధవారం చోటు చేసుకుంది. ఇంటికి రమ్మని పిలిస్తే రాక పోవడంతో కోపంతో ఆమె భర్తే కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
పాకిస్థాన్కు చెందిన ప్రముఖ గాయని రేష్మ... పాష్ఠో స్టేజీ స్టేజ్ ఆర్టిస్టుగా కూడా పాపులర్ అయ్యారు. భర్త ఫైదా ఖాన్తో గొడవల కారణంగా ఆమె కొంతకాలంగా ఖైబర్ పంఖ్తువా జిల్లాలోని నౌషెరా ప్రాంతంలోని తన పుట్టింట్లోనే ఉంటున్నారు.
కొంతకాలం పాటు విదేశాల్లో పని చేసిన ఫైదా ఖాన్ తిరిగి పాక్ వచ్చి.... భార్యను ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె నిరాకరించంతో గొడవ చేశాడు. గొడవ ముదరడంతో ఫైదా ఖాన్ రేష్మపై కాల్పులు జరుపడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు.
రేష్మ సోదరుడు ఒబెయిదుల్లా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఫైదా ఖాన్ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. రేష్మ హత్య పాకిస్థాన్లో సంచలనం అయింది.