Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
పాకిస్థాన్ సింగర్కు భారతీయ పౌరసత్వం మంజూరు
హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, పాకిస్థాన్కు చెందిన అద్నాన్ సమీకి భారత పౌరతస్వం లభించింది. జనవరి 1, 2016 నుండి అతను భారత పౌరుడిగానే పరిగణించబడతాడు. ఈ మేరకు మినిస్ట్రీఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. భారత పౌరసత్వం కోసం అద్నాన్ సమీ పాకిస్థాన్ పౌరసత్వాన్ని వదులుకున్నారు.
ఇండియన్ సిటిజెన్ ఆక్ట్ 1955 లోని సెక్షన్ 6 ప్రకారం అతనికి భారత పౌరసత్వం లభించింది. 2001 నుండి అద్నాన్ సమీ భారత్ లోనే నివాసం ఉంటున్నారు. చాలా ఏళ్ల క్రితమే అతను భారత పౌరసత్వం కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ మేరకు అటార్నీజనరల్ ఆఫ్ ఇండియా నుండి అతనికి పౌరసత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒక సంగీత కళాకారుడిగా అతను భారతీయ సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలకు కూడా అతనికి పౌరసత్వం లభించడానికి తోడ్పడ్డాయి.
2011లో ఇండియా వచ్చిన తర్వాత అద్నాన్ సమీ బాలీవుడ్ తో పాటు ఇతర భారతీయ బాషల్లోనూ ప్లేబ్యాక్ సింగర్ గా బిజీ అయ్యారు. హిందీతో పాటు, కన్నడ, తెలుగు, తమిళం, అస్సామీ, మళయాలం ఇలా అనేక భారతీయ బాషల్లో గాయకుడిగా తన ప్రతిభ కనరిచాడు.
తెలుగులో ఆయన అనేక సినిమాల్లో పాటలు పాడారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో ‘ఏ జిల్లా ఏజిల్లా...' పాటతో పాటు వర్షం, మహానంది, యోగి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, శంకర్ దాదా జిందాబాద్, జయీభవ, 100%లవ్, ఊసరవెల్లి, ఇష్క్, జులాయి, దేవుడు చేసిన మనుషులు, దేనికైనా రెడీ, గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, టెంపర్ చిత్రాల్లో ఆయన పాటలు పాడారు.