Pakka Comercial: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వివాదంపై దారుణంగా సెటైర్.. ముగ్గురితో ఎఫైర్ అంటూ..
గోపీచంద్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన పక్క కమర్షియల్ సినిమా ఈ శుక్రవారం భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో గోపీచంద్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇక ట్రైలర్ ద్వారా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన పక్కా కమర్షియల్ సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుంది అనేది కూడా అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా లో ఉన్న ఒక సీన్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివాదంగా మారిన మూడు రాజధానుల విషయంపై సెటైర్ వేసినట్లుగా అనిపిస్తుంది అని కామెంట్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Recommended Video


గోపిచంద్ ఆశలన్నీ ఈ సినిమాపైనే..
మ్యాచో హీరో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. చివరగా వచ్చిన సిటీమార్ సినిమా పరవాలేదు అనిపించినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో ఆ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేయలేకపోయింది. ఇక ప్రస్తుతం గోపీచంద్ ఆశలన్నీ కూడా పక్క కమర్షియల్ సినిమా పైనే ఉన్నాయి. రాశి కన్నా మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA2 యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

పాజిటివ్ బజ్
పక్క కమర్షియల్ సినిమా ట్రైలర్ తోనే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది. మారుతీ దర్శకత్వంలో ఎలాంటి సినిమా వచ్చిన కూడా మంచి కామెడీ ఉంటుంది అని ప్రేక్షకులలో ఒక నమ్మకం అయితే ఉంది. అలాగే మరోవైపు గోపీచంద్ నుంచి మాస్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై అంచనాల గట్టిగానే పెంచుకున్నారు. ట్రైలర్ లో అయితే కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా హైలెట్ కావడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశమైతే ఉంది.

అలాంటి టాక్
పక్కా కమర్షియల్ సినిమా విభిన్నమైన టాక్ ను అందుకుంటోంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయి అని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో కోర్టు డ్రామా కూడా బాగానే వర్కౌట్ అయింది అని కాకపోతే కొన్ని రొటీన్ సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి అని కూడా సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి.

రాజధానిపై సెటైర్?
అలాగే సోషల్ మీడియాలో మరొక కొత్త విషయం కూడా వైరల్ గా మారుతొంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన ఒక వివాదాన్ని గుర్తు చేసే విధంగా దర్శకుడు మారుతి అందులో డైలాగ్స్ క్రియేట్ చేయడం హాట్ టాపిక్ గా నిలిచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం మూడు రాజధానుల విషయంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు ఆ విషయంలో సెటైర్ వేసినట్లు కామెంట్స్ వస్తున్నాయి.

ఇల్లిగల్ ఎఫైర్స్ అంటూ..
ఇక పక్కా కమర్షియల్ సినిమాలో ఏకంగా మూడు రాజధానులని చెప్పకుండా ఊహించని విధంగా ఒక సీన్లో సెటైర్ వేసినట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి అమరావతి, కర్నూల్, వైజాగ్ ఏరియాల్లో ఇల్లిగల్ ఎఫైర్స్ కొనసాగించినట్లు సీన్ ఉండడంతో ఈ సీన్ పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మరి ఈ సీన్ పై రాజకీయ నాయకుల నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తాయో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











