twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదే పంజా స్టోరీ....(కొత్తదనం కరువు!)

    By Bojja Kumar
    |

    పవన్ కళ్యాన్ పంజా సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పంజా స్టోరీ కింది విధంగా ఉంది.

    అనాద అయిన జైదేవ్(పవన్ కల్యాణ్)ను భగవాన్(జాకీష్రాఫ్) అనే డాన్ చేరదీస్తాడు. అతనివద్దే పెరిగి పెద్దయిన జైదేవ్ అతనికి రైట్ హ్యాండ్ ఉంటాడు. జైదేవ్ ను అంతా జై అని పిలుస్తుంటారు. భగవాన్ గ్యాంగ్ కు అతుల్ కులకర్ణి గ్యాంగ్ కు అస్సలు పడదు. కానీ జైని ఎదుర్కోవడం అతుల్ కులకర్ణి గ్యాంగ్ వల్ల కాదు.

    భగవాన్ కొడుకు మున్నా(అడవిశేషు) డ్రగ్స్ అలవాటయి, అమ్మాయిల పిచ్చి ఉన్నోడు. మున్నా కన్ను జాహ్నవి(అంజలి లవానియా) మీద పడుతుంది. కానీ జాహ్నవి జై అంటే ఇష్ట పడుతోంది. కానీ జై ప్రేమించేది సంధ్య(జారా జేన్)ను...

    జాహ్నవి తనను తిరస్కరిస్తుండటంతో తట్టుకోలేని మున్నా ఆమెను చంపేస్తాడు. దీంతో ఆగ్రహించిన జై...మున్నాను చంపేస్తాడు. తన కొడుకును చంపడంతో భగవాన్ జైదేవ్ పై పగ పెంచుకుంటాడు. అతుల్ కులకర్ణి గ్యాంగ్ కూడా జైదేవ్ ను చంపేందుకు తిరుగుతుంటారు.

    ఈ క్రమంలో జై కోల్‌కతాను విడిచి తన గర్ల్ ఫ్రెండ్ సంధ్యకు చెందిన ఆంధ్రప్రదేశ్ లోని గ్రామానికి వస్తాడు. అక్కడ సాంబశివుడు అనే స్మగ్లర్ మూలంగా సంధ్య కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సాంబశివున్ని చంపేసిన జై...అతన్ని పాపారాయుడే(బ్రహ్మానందం) చంపినట్లు సీన్ క్రియేట్ చేస్తాడు. ఆ క్రమంలోనే పాపారాయుడు పాట ఉంటుంది. పాపారాయుడు కూడా తాగిన మత్తులో నేనే చంపి ఉంటాను అని భావిస్తుంటాడు.

    ఆ తర్వాత జై భగవాన్ గ్యాంగ్, అతుల్ కులకర్ణి గ్యాంగ్ పని పడతాడు. కథ సుఖాంతం అవుతుంది.

    English summary
    Tollywood power star Pawan kalyan Panja movie story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X