Don't Miss!
- News 527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు-జాబితాలో ఇవే- ఈయూ గుర్తింపు..!
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఇదే పంజా స్టోరీ....(కొత్తదనం కరువు!)
పవన్ కళ్యాన్ పంజా సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పంజా స్టోరీ కింది విధంగా ఉంది.
అనాద అయిన జైదేవ్(పవన్ కల్యాణ్)ను భగవాన్(జాకీష్రాఫ్) అనే డాన్ చేరదీస్తాడు. అతనివద్దే పెరిగి పెద్దయిన జైదేవ్ అతనికి రైట్ హ్యాండ్ ఉంటాడు. జైదేవ్ ను అంతా జై అని పిలుస్తుంటారు. భగవాన్ గ్యాంగ్ కు అతుల్ కులకర్ణి గ్యాంగ్ కు అస్సలు పడదు. కానీ జైని ఎదుర్కోవడం అతుల్ కులకర్ణి గ్యాంగ్ వల్ల కాదు.
భగవాన్ కొడుకు మున్నా(అడవిశేషు) డ్రగ్స్ అలవాటయి, అమ్మాయిల పిచ్చి ఉన్నోడు. మున్నా కన్ను జాహ్నవి(అంజలి లవానియా) మీద పడుతుంది. కానీ జాహ్నవి జై అంటే ఇష్ట పడుతోంది. కానీ జై ప్రేమించేది సంధ్య(జారా జేన్)ను...
జాహ్నవి తనను తిరస్కరిస్తుండటంతో తట్టుకోలేని మున్నా ఆమెను చంపేస్తాడు. దీంతో ఆగ్రహించిన జై...మున్నాను చంపేస్తాడు. తన కొడుకును చంపడంతో భగవాన్ జైదేవ్ పై పగ పెంచుకుంటాడు. అతుల్ కులకర్ణి గ్యాంగ్ కూడా జైదేవ్ ను చంపేందుకు తిరుగుతుంటారు.
ఈ క్రమంలో జై కోల్కతాను విడిచి తన గర్ల్ ఫ్రెండ్ సంధ్యకు చెందిన ఆంధ్రప్రదేశ్ లోని గ్రామానికి వస్తాడు. అక్కడ సాంబశివుడు అనే స్మగ్లర్ మూలంగా సంధ్య కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సాంబశివున్ని చంపేసిన జై...అతన్ని పాపారాయుడే(బ్రహ్మానందం) చంపినట్లు సీన్ క్రియేట్ చేస్తాడు. ఆ క్రమంలోనే పాపారాయుడు పాట ఉంటుంది. పాపారాయుడు కూడా తాగిన మత్తులో నేనే చంపి ఉంటాను అని భావిస్తుంటాడు.
ఆ తర్వాత జై భగవాన్ గ్యాంగ్, అతుల్ కులకర్ణి గ్యాంగ్ పని పడతాడు. కథ సుఖాంతం అవుతుంది.