Don't Miss!
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- News కేసీఆర్ డ్రామా అదిరిందయ్యా చంద్రం!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
నందమూరి హీరోకి నో చెప్పి ఇప్పుడు బాధ పడుతోన్న హీరోయిన్..!?
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, మల్లికార్జున దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. కళ్యాణ్ రామ్ ఆల్ రెడీ మల్లికార్జున్ డైరక్షన్ లో టిఎన్ వెంకటేష్ నిర్మాణంలో రూపొందిన 'అభిమన్యు" అనే చిత్రం హిట్ టాక్ తెచ్చుకొన్నది మరి ఇప్పుడు వీరిద్దరి కాంబినేషలో మరో చిత్రం రూపొందనుంది. అయితే ఈ చిత్రంలో కథ డిమాండ్స్ మేరకు ఓ ఐటంసాంగ్ ని పెట్టనున్నారు. ఈ చిత్రంలో రాబోయే ఐటంసాంగ్ కి ఎవరిని తీసుకుందామా అని ఆలోచించిన కళ్యాణ్ రామ్ చివరికి 'పప్పు" చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికను అడిగారట. కానీ నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రంలో హీరోయిన్ అంటే దీపిక ఓప్పుకునేదో ఏమో కానీ ఐటంసాంగ్ అనగానే ఆ ఆఫర్ ను తిరస్కరించిందట. ఇటీవల విడుదలైన 'పప్పు" ప్లాప్ అయ్యింది. 'పప్పు" హిట్ అవుతుంది, ఆ తర్వాత హీరోయిన్ ఆఫర్స్ వస్తాయనే ఆశతో వున్న దీపికకు నిరాశే మిగిలింది. కళ్యాణ్ రామ్ తో ఎందుకు కాదన్నానా? అని ఇప్పుడు బాధపడుతోందని సమాచారం.