Don't Miss!
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘పరంపర’కు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్
హైదరాబాద్: సీనియర్ నటులు నరేష్, ఆమని ముఖ్యపాత్రలో ధృతి మీడియా పతాకంపై మధు మహంకాళి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పరంపర'. ఒక కుటుంబం యొక్క కలలాంటి కథ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో స్వచ్చమైన మానవీయ బంధాలను అత్యద్భుతంగా తెరపై చూపించిన మధు మహంకాళికి ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ లో సత్కారం లభించింది. ‘పరంపర' చిత్రానికి ప్లాటినమ్ అవార్డ్ బహూకరించబడింది.
ఈ అవార్డు లభించడం పట్ల చిత్ర దర్శక నిర్మాత మహంకాళి మధు సంతోషం వ్యక్తం చేసారు. అక్టోబర్లో ‘పరంపర' చిత్రాన్ని విడుదల చేయనున్నామని తెలిపారు. సీనియర్ నరేష్, ఆమని ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
చిత్ర విశేషాలను దర్శక నిర్మాత మధుమహంకాళి తెలియజేస్తూ- మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే పరిశ్రమలో మంచి టాక్ ఉంది. కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథ అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మాస్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, క్లాసిక్ ఎంటర్టైనర్స్ను కూడా ఆదరిస్తారని ‘దృశ్యం' సినిమాతో రుజువుచేశారు. ఆ నమ్మకంతోనే ‘పరంపర' చిత్రాన్ని పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రీకరిస్తున్నామని తెలిపారు.