twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పరంపర’కు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సీనియర్ నటులు నరేష్, ఆమని ముఖ్యపాత్రలో ధృతి మీడియా పతాకంపై మధు మహంకాళి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పరంపర'. ఒక కుటుంబం యొక్క కలలాంటి కథ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో స్వచ్చమైన మానవీయ బంధాలను అత్యద్భుతంగా తెరపై చూపించిన మధు మహంకాళికి ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ లో సత్కారం లభించింది. ‘పరంపర' చిత్రానికి ప్లాటినమ్ అవార్డ్ బహూకరించబడింది.

    ఈ అవార్డు లభించడం పట్ల చిత్ర దర్శక నిర్మాత మహంకాళి మధు సంతోషం వ్యక్తం చేసారు. అక్టోబర్లో ‘పరంపర' చిత్రాన్ని విడుదల చేయనున్నామని తెలిపారు. సీనియర్ నరేష్, ఆమని ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

    Parampara Got Platinum Award at International Film Awards

    చిత్ర విశేషాలను దర్శక నిర్మాత మధుమహంకాళి తెలియజేస్తూ- మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే పరిశ్రమలో మంచి టాక్ ఉంది. కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథ అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, క్లాసిక్ ఎంటర్‌టైనర్స్‌ను కూడా ఆదరిస్తారని ‘దృశ్యం' సినిమాతో రుజువుచేశారు. ఆ నమ్మకంతోనే ‘పరంపర' చిత్రాన్ని పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రీకరిస్తున్నామని తెలిపారు.

    English summary
    THE telugu feature film PARAMPARA, Starring Senior Actor Naresh, Amani and others, is getting good acclaim in the International film festival circuit and is gaining momentum in the International scenario.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X