Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘పరంపర’కు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్
హైదరాబాద్: సీనియర్ నటులు నరేష్, ఆమని ముఖ్యపాత్రలో ధృతి మీడియా పతాకంపై మధు మహంకాళి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పరంపర'. ఒక కుటుంబం యొక్క కలలాంటి కథ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో స్వచ్చమైన మానవీయ బంధాలను అత్యద్భుతంగా తెరపై చూపించిన మధు మహంకాళికి ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ లో సత్కారం లభించింది. ‘పరంపర' చిత్రానికి ప్లాటినమ్ అవార్డ్ బహూకరించబడింది.
ఈ అవార్డు లభించడం పట్ల చిత్ర దర్శక నిర్మాత మహంకాళి మధు సంతోషం వ్యక్తం చేసారు. అక్టోబర్లో ‘పరంపర' చిత్రాన్ని విడుదల చేయనున్నామని తెలిపారు. సీనియర్ నరేష్, ఆమని ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
చిత్ర విశేషాలను దర్శక నిర్మాత మధుమహంకాళి తెలియజేస్తూ- మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే పరిశ్రమలో మంచి టాక్ ఉంది. కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథ అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మాస్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, క్లాసిక్ ఎంటర్టైనర్స్ను కూడా ఆదరిస్తారని ‘దృశ్యం' సినిమాతో రుజువుచేశారు. ఆ నమ్మకంతోనే ‘పరంపర' చిత్రాన్ని పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రీకరిస్తున్నామని తెలిపారు.