Don't Miss!
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నరేంద్ర మోడీ పాత్రలో లింగం మావయ్య!
హైదరాబాద్: 2014లో రాబోయే పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకుని బీజేపీ పార్టీ గెలుపుకు తోడ్పడే విధంగా ఓ సినిమా రాబోతోంది. బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ ఎన్నికల రథ సారథి, గురజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ (శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో లింగం మావయ్య పాత్ర) నటించబోతున్నట్లు తెలుస్తోంది.
అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు అయిన మిఠేష్ పటేల్ నరేంద్ర మూడీపై తీసే ఈ సినిమాకు స్క్రిప్టు అందించారని, ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దేశంలో మెడీకి ఇంత ఆదరణ పెరగడాకి గల కారణం ఏమిటి? గుజరాత్ను అద్భుతంగా అభివృద్ధి చేసిన మెడీ చేతికి ప్రధాని పగ్గాలు వెళితే దేశంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విధంగా ఈ సినిమా ఉండబోతోందట.
దాదాపు రూ. 50 కోట్ల వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కబోతోందని, ఈ చిత్రం షూటింగ్ నవంబర్లో మొదలు పెట్టి మార్చి 2014 నాటికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. నరేంద్ర మోడీకి సూచనల మేరకు స్క్రిప్టులో కొన్ని మార్పులు, చేర్పులు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో మోడీ గురించి పలు ఆసక్తికర విషయాలు సైతం పొందు పరచనున్నారని, ఒక సాధారణ వ్యక్తి అయిన మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడు, దేశ ప్రజలు ఆయన్ను ప్రధాన మంత్రిగా ఎందుకు కోరుకుంటున్నారు అనే అంశాలు సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.