Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఏం కోల్పోయామో తెలుస్తోంది:పరుచూరి బ్రదర్శ్
మేం సాధించిన విజయాలు చూసి ఈ రోజు పొంగిపోతున్నామేమో. కానీ ఆలోచిస్తే ఏం కోల్పోయామో తెలుస్తుంది. రామకృష్ణ స్డూడియోస్లో కూర్చుంటే ఫలానా సంవత్సరంలో ఇక్కడ కూర్చుని ఫలానా డైలాగు రాశాం అని బాగానే గుర్తొస్తుంది. కానీ మా కుటుంబంతో గడిపిన జ్ఞాపకాలేం గుర్తుండవు అంటూ ఆవేదనతో చెప్తున్నారు పరుచూరి గోపాల కృష్ణ. టీఎస్సార్ లలితకళాపరిషత్తు పరుచూరి బ్రదర్స్ కి విశ్వవిఖ్యాత రచనాసార్వభౌములు అనే బిరుదుని ప్రదానం చేసిన సందర్భంగా వారు మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.
అదే విషయమై పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... మా ప్రస్ధానం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే సాగింది. నిజం ఓ నటుడు డైలాగు చెప్పి పక్కకెళ్లిపోతాడు. ఓ దర్శకుడి పని యాక్షన్తో మొదలై కట్తో అయిపోతుంది. రచయిత అలా కాదు రేపటి సన్నివేశం కోసం కుస్తీ పట్టాలి. ఈ 33 యేళ్లూ అదే చేశాం. చేస్తూనే ఉన్నాం. ఇంట్లో పరిస్థితి ఏమిటో ఏనాడూ కనుక్కోలేదు. పని ధ్యాసలో పడి పిల్లల చదువులు కూడా పట్టించుకోలేదు అన్నారు.
ప్రస్తుత తెలుగు సినిమా పరిస్ధితిని వివరిస్తూ... హీరో పాత్ర చిత్రణ ఆధారంగా కథలు అల్లేస్తున్నారు. నాలుగైదు సన్నివేశాలుంటే వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. మరి మిగిలిన సన్నివేశాల మాటేంటి? ఇలాగైతే సినిమా ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతుందో తెలీదు. కథ రాయడానికి ఓ రచయిత ఉంటాడనే సంగతి మరచిపోతున్నారు. డీవీడీల్లోంచి కథలు పుట్టేస్తున్నాయి అని చెప్పుకొచ్చారు.