Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శోభన్ బాబు వల్లే, ఆ హీరోయిన్ పొట్టి పంతులు అనేసింది: పరుచూరి
ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన సినీ అనుభవాలను గుర్తు చేసుకుంటూ వీడియోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజా వీడియోలో అందాల నటుడు శోభన్ బాబు గురించి గుర్తు చేసుకున్నారు. ఆయన సలహాలతో స్పూర్తి పొంది భూములు కొన్నవారు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారని పరుచూరి తెలిపారు.
అప్పు చేసి కొనమని చెప్పేవారు
ఇండస్ట్రీలో ఎంతో మందికి భూమి విలువ చెప్పింది శోభన్ బాబుగారు, నీ దగ్గర రూపాయి ఉంటే మరో రూపాయి అప్పుచేసైనా ముందు భూమి లేదా స్థలం కొనేసేయ్ అని చెప్పేవారు. ఆ తర్వాత అప్పు తీర్చుకోమనేవారు. ఆయన వల్ల బాగా ఇన్ స్పైర్ అయిన వాళ్లు చంద్రమోహన్ గారు. మురళీ మోహన్ గారు అయితే మొత్తం రియల్ ఎస్టేట్ కి వెళ్లిపోయారు.... అని పరుచూరి తెలిపారు.
ఘోస్ట్ రైటర్గా పని చేశాను
1980లో పిసి రెడ్డిగారి పగబట్టిన సింహం, బంగారు భూమి,జగ్గు, భోగభాగ్యాలు సినిమాలకు ఘోస్ట్ రైటర్గా చేశాను. ఆయన మాకు మెయిన్గా అవకాశం ఇచ్చిన సినిమా శోభన్ బాబుగారి ‘మానవుడే మహనీయుడు'. ఈ సినిమాకు మాటలు రాయడంతో పాటు మూడు పాటలు కూడా రాశాను.... అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.
ఆమె నన్ను పొట్టిపంతులు అనేవారు
"అప్పట్లో శోభన్ బాబుగారితో చేసిన హీరోయిన్ సుజాతగారు. సెట్లో ఉన్నపుడు సుజాతగారికి డైలాగులు చెబుతుండేవాడిని. పది సంవత్సరాల తర్వాత ఎయిర్ పోర్టులో ఆమె కలిశారు. నా దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి మీరు పరుచూరి బ్రదర్స్ అని నాకు తెలుసు. ఇలా కాకుండా ఇంకా ఎలా అయినా తెలుసా? అంటే నేను నవ్వాను. నేను మీకు రచయితగానే తెలుసు, కానీ మీరు మరిచిపోయారు. 1980లో మానవుడు మహనీయుడు అపుడు నేను లెక్చరర్ అని తెలిసి మీరు నన్ను పొట్టి పంతులు పిలిచేవారు అని గుర్తు చేశాను. ఆ విషయం చెప్పగానే ఆమె అలా చూస్తూ ఉండిపోయారు. అప్పటి పొట్టి పంతులు ఇపుడు ఇంత పెద్ద రచయిత అయ్యాడా? అన్న ఆశ్చర్యం ఆమెలో కనిపించింది." అని పరుచూరి తెలిపారు.
శోభన్ బాబుగారి సినిమా వల్లనే ఎన్టీఆర్ గారు పిలిచారు
శోభన్ బాబుగారి ‘మానవుడు మహనీయుడు' సినిమా చేయడం వల్లనే ఎన్టీఆర్ గారు మమ్మల్ని పిలిపించారు. అప్పట్లో ఏచూరిగారు అని ఓ విలేకరి ఉండేవారు. శోభన్ బాబు గారికి బాగా ఆత్మీయులు. రామారావు గారిని కూడా ఏచూరి గారు కలుస్తూ ఉండేవారు. ఆయనతో ఓసారి రామారావుగారు కసిగా డైలాగులు రాసే వారు దొరకడం లేదని అన్నారట. ‘మానవుడు మహనీయుడు' సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ డైలాగులు బాగా రాశారు అని ఆయనకు చెప్పడంతో మా గురించి అన్నగారికి తెలిసింది. అలా అన్నగారి సినిమాల్లో మాకు అవకాశాలు వచ్చాయి అని... గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.