Don't Miss!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ తప్పు చేశాడు.. మాజీ సీఎంను ఆదర్శంగా తీసుకోవాలి.. జగన్లా చేయాలి: రచయిత షాకింగ్ కామెంట్స్
Recommended Video
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ తమదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాలకు స్టోరీలు, డైలాగ్స్ అందించిన ఈ సోదరులు.. నటనతోనూ ఆకట్టుకున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వర్రావు కొద్దిరోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, వీరిలో గోపాలకృష్ణ పరుచూరి పలుకులు అనే పేరుతో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఒక్కో వీడియోలో ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ఫలితాలపై..
ఎన్నికల ఫలితాలపై పవన్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘తానా సభల కోసం అమెరికా వెళ్లినప్పుడు పవన్ చాలా విషయాలు మాట్లాడాడు. ఎన్నికల ఫలితాలపై స్పందిచాడు. ‘‘రిజల్ట్ చూసినప్పుడు పదిహేను నిమిషాలు బాధ పడ్డాను'' అని పవన్ అన్నాడు. ఆ పదిహేను నిమిషాలు కూడా అతడు బాధ పడి ఉండకూడదు. ఎందుకంటే.. ఓటింగ్ జరుగుతున్నప్పుడే అందరికీ ఫలితం అర్థమైపోయింది కదా. అందుకే అస్సలు బాధపడొద్దు' అని పరుచూరి చెప్పుకొచ్చారు.
భయమనేదే తెలియదు
అలాగే, పవన్ భయం గురించి చెబుతూ.. ‘తానా సభల్లో నాకు భయమెందుకు అని పవన్ అన్నాడు. వాస్తవానికి ఆయనకు భయం ఉంటదంటే నేను నమ్మను. అతడికి కొంచెం కూడా భయం ఉండదు. పవన్లో ఒక యోగి ఉన్నాడని తెలుస్తుంది. ఆ యోగి పవన్ను పాజిటివ్ ఎనర్జీతో నడిపిస్తున్నాడు' అని వివరించారు.
పవన్ సినిమాలు మానొద్దు
పవన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన దానిని ప్రస్తావిస్తూ.. ‘జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నారు. అయితే మళ్లీ సినిమాల్లో నటించే విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ విముఖంగా ఉన్నారని ఎప్పటికప్పుడు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. కానీ, ఆయన సినిమాలు చేస్తే బాగుటుంది. అన్న ఎన్టీఆర్ గారు కూడా సినిమాలు చేసి ప్రజలను ప్రభావితం చేశారు. ఈ విషయాన్ని పవన్ గుర్తు తెచ్చుకోవాలి' అని పరుచూరి పేర్కొన్నారు.
ఎంజీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలి
పవన్ సినిమాలు చేయాలనే దానిపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రరావు పేరును ప్రస్తావిస్తూ.. ‘పవన్ ఎంజీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఆయన సినిమాల్లో నటించారు. రాజకీయాలను, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ కొంతకాలం ముందుకు సాగారు. పవన్ కళ్యాణ్ సైతం సోషల్ మెసేజ్ ఉన్న అంశాలను తీసుకుని సినిమాలు చేయాలి' అని చెప్పుకొచ్చారు.
జగన్లా పట్టుదలతో ఉండాలి
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయినప్పటి నుంచి ఎంతో ఓపికగా పోరాటం చేస్తున్నారు. సీఎం అవ్వాలన్న పట్టుదలతో పది సంవత్సరాల పాటు పని చేశారు. అలాగే పవన్ కూడా ప్రజల్లో ఉండాలి' అని సలహా ఇచ్చారు.