twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఏదీ ఏమైనా సైరా ఆస్కార్ కొట్టాలి.. అందుకే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రాలేకపోయా’

    |

    మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ సైరా నరసింహారెడ్డి. తొలి స్వతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీజర్, ట్రయిలర్స్, సాంగ్ తో ఓ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సైరా విడుదలకు సిద్దంగా ఉంది.

    గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

    గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

    తాజాగా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, వివి వినాయక్, కొరటాల శివలాంటి ప్రముఖులు అతిథులుగా విచ్చేస్తున్నారు. అయితే వారంతా విచ్చేసి సైరా విశేషాల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ వచ్చేసి అభిమానులను సంతోషంలో ముచ్చేత్తారు. మెగా హీరోలందరూ విచ్చేసి.. ఈవెంట్ ను సక్సెస్ చేశారు.

    హాజరు కాని పరుచూరి గోపాలక`ష్ణ

    హాజరు కాని పరుచూరి గోపాలక`ష్ణ

    ఈవెంట్ కు ఎంతమంది వచ్చినా.. పరుచూరి బ్రదర్స్ లేకపోతే మెగా ఈవెంట్ అసంపూర్తిగానే ఉంటుంది. అయితే పరుచూరి వెంకటేశ్వర్ రావు స్టేజ్ పైకి వచ్చి.. సినిమాలోని ఓ డైలాగ్ ను చెప్పి అభిమానులను ఉత్సాహ పరిచారు. కానీ తాను రాలేకపోయానని, అందుకు చాలా బాధపడ్డాడని పరుచూరి గోపాలక`ష్ణ వెల్లడించారు. పరుచూరి పలుకులు అనే యూ ట్యూబ్ ద్వారా సినీ పాఠాలు చెప్పే.. ఆయన ఆ వేదిక నుంచి తన బాధను చెప్పుకొచ్చారు.

    అనారోగ్యం కారణంగానే రాలేకపోయాను..

    అనారోగ్యం కారణంగానే రాలేకపోయాను..

    తనకు ఆరోగ్యం సహకరించకపోయే సరికి ఈవెంట్కు రాలేకపోయానని చెప్పుకొచ్చాుడు. అది తెలసి చిరంజీవి ఫోన్ చేశారని, నేను ఈవెంట్కు రాలేకపోతున్నాను.. మిస్ అవుతున్నాను.. అని తాను అన్నట్లు.. మీరు ఈవెంట్ను మిస్ కావడం కాదు.. ఈవెంటే మిమ్మల్ని మిస్ అవుతోందని అన్నాడని పేర్కొన్నాడు. అయితే సురేందర్ రెడ్డి కోరిక మేరకు సైరాకు రెండు వర్షెన్స్ రాశామని..అందులో ఎన్ని వాడుకున్నా.. పర్లేదు, వేరే వారితో ఇంకా రాయించుకున్నా పర్లేదు కానీ.. ఆస్కార్కు వెళ్లాలని తన అన్నయ్య (పరుచూరి వెంకటేశ్వర్రావు) కోరుకున్నట్లు తెలిపారు.

    ఎన్నో ప్రత్యేకలతో రానున్న సైరా

    ఎన్నో ప్రత్యేకలతో రానున్న సైరా

    4500 మంది డ్యాన్సర్లతో 14 రోజుల పాటు తెరకెక్కించిన జాతర పాట, 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్స్తో 35 రోజుల పాటు తెరకెక్కించిన యాక్షన్ సీన్స్..ఇలా ఈ మూవీలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తాజాగా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఈ మూవీ రెండు గంటల యాభై నిమిషాలు పాటు ఉంటుందని ప్రకటించారు. బిగ్ బీ అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయన తార, తమన్నా, జగపతి బాబు లాంటి ఎంతో మంది భారీ తారాగణంతో తెరకెక్కించారు. బాంబే, బెంగళూరులో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసిన చిత్రయూనిట్.. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయనుంది.

    English summary
    Paruchuri Gopalakrishna Revealed Fact for Not Attending Sye Raa Pre Release Event. Because If Illness He Didnot Attend This event. His Brother Paruchuri Venkateshwara Rao Wants To Get Oscar Award. Movie Produced By Ram Charan And directed By Surender Reddy. This Movie Releasing On 2nd October.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X