Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘ఏదీ ఏమైనా సైరా ఆస్కార్ కొట్టాలి.. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాలేకపోయా’
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ సైరా నరసింహారెడ్డి. తొలి స్వతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీజర్, ట్రయిలర్స్, సాంగ్ తో ఓ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సైరా విడుదలకు సిద్దంగా ఉంది.
గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్
తాజాగా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, వివి వినాయక్, కొరటాల శివలాంటి ప్రముఖులు అతిథులుగా విచ్చేస్తున్నారు. అయితే వారంతా విచ్చేసి సైరా విశేషాల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ వచ్చేసి అభిమానులను సంతోషంలో ముచ్చేత్తారు. మెగా హీరోలందరూ విచ్చేసి.. ఈవెంట్ ను సక్సెస్ చేశారు.
హాజరు కాని పరుచూరి గోపాలక`ష్ణ
ఈవెంట్ కు ఎంతమంది వచ్చినా.. పరుచూరి బ్రదర్స్ లేకపోతే మెగా ఈవెంట్ అసంపూర్తిగానే ఉంటుంది. అయితే పరుచూరి వెంకటేశ్వర్ రావు స్టేజ్ పైకి వచ్చి.. సినిమాలోని ఓ డైలాగ్ ను చెప్పి అభిమానులను ఉత్సాహ పరిచారు. కానీ తాను రాలేకపోయానని, అందుకు చాలా బాధపడ్డాడని పరుచూరి గోపాలక`ష్ణ వెల్లడించారు. పరుచూరి పలుకులు అనే యూ ట్యూబ్ ద్వారా సినీ పాఠాలు చెప్పే.. ఆయన ఆ వేదిక నుంచి తన బాధను చెప్పుకొచ్చారు.
అనారోగ్యం కారణంగానే రాలేకపోయాను..
తనకు ఆరోగ్యం సహకరించకపోయే సరికి ఈవెంట్కు రాలేకపోయానని చెప్పుకొచ్చాుడు. అది తెలసి చిరంజీవి ఫోన్ చేశారని, నేను ఈవెంట్కు రాలేకపోతున్నాను.. మిస్ అవుతున్నాను.. అని తాను అన్నట్లు.. మీరు ఈవెంట్ను మిస్ కావడం కాదు.. ఈవెంటే మిమ్మల్ని మిస్ అవుతోందని అన్నాడని పేర్కొన్నాడు. అయితే సురేందర్ రెడ్డి కోరిక మేరకు సైరాకు రెండు వర్షెన్స్ రాశామని..అందులో ఎన్ని వాడుకున్నా.. పర్లేదు, వేరే వారితో ఇంకా రాయించుకున్నా పర్లేదు కానీ.. ఆస్కార్కు వెళ్లాలని తన అన్నయ్య (పరుచూరి వెంకటేశ్వర్రావు) కోరుకున్నట్లు తెలిపారు.
ఎన్నో ప్రత్యేకలతో రానున్న సైరా
4500 మంది డ్యాన్సర్లతో 14 రోజుల పాటు తెరకెక్కించిన జాతర పాట, 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్స్తో 35 రోజుల పాటు తెరకెక్కించిన యాక్షన్ సీన్స్..ఇలా ఈ మూవీలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తాజాగా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఈ మూవీ రెండు గంటల యాభై నిమిషాలు పాటు ఉంటుందని ప్రకటించారు. బిగ్ బీ అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయన తార, తమన్నా, జగపతి బాబు లాంటి ఎంతో మంది భారీ తారాగణంతో తెరకెక్కించారు. బాంబే, బెంగళూరులో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసిన చిత్రయూనిట్.. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయనుంది.