Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
పరుచూరి ఇంట్లో విషాదం.. చిరంజీవి పరామర్శ
తెలుగు చిత్ర సీమలో పరుచూరి బ్రదర్స్ అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. దాదపు 350కి పైగా చిత్రాలకు కథ, మాటలు, కథనాన్ని అందించిన ఘనత వారిది. అలాంటి పరుచూరి ఇంట్లో నేడు విషాదం నెలకొంది. పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి(74) గుండెపోటుతో కన్నుమూశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు పరుచూరిని పరామర్శిస్తున్నారు. ఈ మేరకు చిరంజీవి పరుచూరిని ప్రత్యేకంగా పరామర్శించినట్టు తెలుస్తోంది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని స్వగృహంలో మృతి చెందారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే చిరంజీవి తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు వెంకటేశ్వరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానభూతిని తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.
ఇక పరుచూరి వెంకటేశ్వర రావు సతీమణి మరణించడంతో గోపాల కృష్ణ సోషల్ మీడియా టీం కూడా స్పందించింది. 'పరుచూరి వెంకటేశ్వరరావు గారి ధర్మ పత్ని పరుచూరి విజయలక్ష్మి గారు ఇవాళ ఉదయం గుండెపోటు తో మరణించారు అని తెలియజేయుటకు చింతిస్తున్నాము' అని సోషల్ మీడయాలో ట్వీట్ చేసింది. సినీ ప్రముఖులెందరో పరుచూరిని ఓదార్చుతున్నారు.