Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
పసుపులేటి రామారావు కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటా.. చిరంజీవి హామీ
తెలుగు సినీ పరిశ్రమకు సీనియర్ జర్నలిస్టుగా, పీఆర్ఓగా ఎన్నో సేవలందించిన పసుపులేటి రామారావు (70) మృతి చిత్రసీమలో విషాద ఛాయలు నింపింది. యూరిన్ ఇన్ఫెక్షన్కి గురైన ఆయన ఈ రోజు (మంగళవారం) ఉదయం వనస్థలిపురంలోని ప్రైవేట్ హాస్పిటల్లో మరణించారు. సన్నిహితులు, అభిమానుల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని కృష్ణానగర్లో ఉన్న ఆయన సొంతింటికి తరలించారు.
చిరంజీవి ఆప్తుడు.. కళామతల్లి సేవకుడు
సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఆప్తుడు పసుపులేటి రామారావు. దాదాపు 5 దశాబ్దాల పాటు సినీ జర్నలిస్టుగా పనిచేసిన ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీ లోని పెద్దల తలలో నాలుకగా ఉన్నారు. ఎన్నో పుస్తకాలు రచించిన ఓ మహా నిఘంటువు పసుపులేటి రామారావు గారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని నేటి యంగ్ హీరోల వరుకు అందరినీ ఇంటర్వ్యూలు చేసిన అనుభవం ఆయనకుంది.
చిరంజీవి సంతాపం.. మెగాస్టార్ ఆవేదన
పసుపులేటి రామారావు మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సంతాపం తెలిపారు. ఈ మేరకు పసుపులేటి రామారావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందారు చిరంజీవి.
నా ఆత్మ బంధువు రామారావు
రామారావు తనకు ఆత్మ బంధువని, సినియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని చిరంజీవి అన్నారు. నేనంటే అతనికి ఎంతో అభిమానం, అతనన్నా నాకంతే అభిమానం అని చిరంజీవి చెప్పారు. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా 'కళ్యాణ్ నాగ చిరంజీవి' అనే పేరు పెట్టుకున్నారని ఆయన చెప్పారు.
ఆయన్ను ఓ జర్నలిస్టుగానే కాకుండా.. ఇలా చూస్తా
''రామారావు
అనారోగ్యంతో
బాధపడుతున్నారని,
నడవలేకపోతున్నారని
తెలిసి
సన్
షైన్
ఆస్పత్రి
వైద్యులు
డాక్టర్
గురవారెడ్డి
దగ్గరికి
పంపించాను.
మోకాళ్ల
ఆపరేషన్
చేయించుకోవాలన్నారు.
అయితే
తన
అక్కయ్య
గారికి
బాగోలేదని,
ఆమె
కోలుకున్నాక
ఆపరేషన్
చేయించుకుంటానని
రామారావు
అన్నారు.
నేనతన్ని
కేవలం
ఒక
జర్నలిస్టుగానే
చూడను.
నీతికీ
నిజాయితీకీ
నిబద్దతకూ
మరోరూపంలా
చూస్తుంటాను''
అని
చెప్పారు
చిరంజీవి.
అన్నిరకాలుగా అండగా ఉంటా.. చిరు హామీ
'రామారావు కుటుంబానికి నేను అన్నిరకాలుగా అండగా ఉంటాను. వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'' అంటూ చిరంజీవి తన సంతాపం వ్యక్తం చేశారు.
Recommended Video
రేపు అంత్యక్రియలు
ఈ రోజు రామారావు స్వగృహంలో ఆయన మృతదేహాన్ని ఉంచి.. రేపు అంత్యక్రియలు జరపాలనుకుంటున్నామని ఆయన తోడల్లుడు చెప్పాడు.