Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరాటే కల్యాణి చీదరించుకుంది, మంచు విష్ణు పట్టించుకోలేదు.. పావలా శ్యామల కష్టాలు
సినీ ఇండస్ట్రీలో ఎవరి జీవితం ఎలా మారుతుందో ఎప్పుడూ చెప్పలేం. అంతకాలం హుందాగా బతికిన వాళ్లు ఒక్కసారిగా ఊహించని కష్టాలు ఎదుర్కొంటారు. కీర్తిప్రతిష్టలతో వెలుగొందిన వాళ్లు తినడానికి తిండి కూడా లేని దీన స్థితిలో ఉండటం ఇప్పటికే చాలా మందిని చూశాం. ఇప్పుడు అలాంటి వారి జాబితాలో మరొక నటి చేరింది. ఆమె పేరు పావల శ్యామల. పావల శ్యామల అంటే తెలుగు ప్రేక్షకులు కొంతమంది వెంటనే గుర్తు పట్టకపోవచ్చు గానీ, ఖడ్గం లో హీరోయిన్ సంఘవికి తల్లిగా చేశారని, గోలీమార్ సినిమాలో విలన్ తో ఫోన్ లో మాట్లాడే ఇంటి పని మనిషి అని చెబితే టక్కున గుర్తు పడతారు. ఇప్పుడు ఆమె కష్టాలతో జీవితం వెళ్లదీస్తున్నారు.
ఓ అనాథ ఆశ్రమంలో..
పావల శ్యామల సుమారు 300కిపైగా సినిమాల్లో నటించారు. ఖడ్గం చిత్రంలో తన కూతురు హీరోయిన్ అవ్వడానికి ఏమైనా చేసే తల్లి పాత్రలో ఆకట్టుకున్నారు పావల శ్యామల. తన మేనరిజంతో అలరించిన ఆమెకు తర్వాత పలు అకాశాలు వచ్చాయి. ఇందులో భాగంగానే గోలీమార్ లో విలన్ తో మాట్లాడే సంభాషణను అంతగా త్వరగా ఎవరు మర్చిపోరు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో కనీసం జీవనం సాగించే స్థితిలో కూడా లేరు. చివరికి తన కూతురితో కలిసి ఓ అనాథ ఆశ్రమంలో బతుకీడుస్తున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలు, ఆమెకు సాయం చేస్తానని చెప్పి చేయనివారి గురించి చెప్పుకొచ్చారు.
సాయం చేస్తానని తప్పుగా..
'మా' అసోసియేషన్ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) లో పావలా శ్యామలకు మెంబర్ షిప్ ఉంది. మెగాస్టార చిరంజీవి స్వయంగా రూ. లక్ష కట్టి ఆమెకు మెంబర్ షిప్ ఇప్పించారు. అలాగే ఆమె కూతురి వైద్యం కోసం రూ. 2 లక్షలు కూడా ఇచ్చారు. కానీ ఆ డబ్బులు అయిపోయాయట. అయితే ఇటీవల కరాటే కల్యాణి సాయం చేస్తానని వచ్చి.. చివరికీ సహాయం చేయకపోగా తప్పుగా మాట్లాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ''కరాటే కల్యాణి మా ఇంటికి వచ్చింది. కానీ అప్పుడు నా కూతురు అనారోగ్యంతో ఉంది. దీంతో ఇళ్లంతా వాసన అంటూ కల్యాణి చీదరించుకుంది. అనంతరం బయటకు వెళ్లిన కల్యాణి.. నేను డబ్బులు డిమాండ్ చేశానని తప్పుగా చెప్పింది. నా కూతురు అనారోగ్యంతో ఉంటే ఇల్లు శుభ్రంగా ఎలా ఉంటుంది'' అని చెప్పుకొచ్చారు పావలా శ్యామల.
నీకు నాకు సంబంధం లేదంటూ..
అనంతరం మంచు విష్ణు 'మా' ప్రెసిడెంట్ గా గతంలో సాయం చేశారని తెలిపారు. ఆ తర్వాత పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ ''మంచు విష్ణు 'మా' ప్రెసిడెంట్ అయిన తర్వాత నా గురించి తెలుసుకుని సహాయంగా ఒక అమ్మాయిని పెట్టారు. కానీ ఆ అమ్మాయి నా ఆరోగ్యం బాగుపడాలంటే ఆపరేషన్ చేయించుకో అని ఒత్తిడి తీసుకొచ్చింది. వైద్యులను సంప్రదిస్తే ఆపరేషన్ కు నా శరీరం సహకరించదని తెలిపారు. దీంతో ఆ అమ్మాయి ఆమెకు నాతో సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు'' అని కన్నీటి పర్యంతమయ్యారు.