ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్
చిరంజీవి అభిమానులు ఇసిఐఎల్ లో ఉన్న రాధిక థియేటర్ లో మెగా బ్లెడ్ డొనేషన్ క్యాంప్ ను మంగళవారం నిర్వహించారు. ఈ క్యాంప్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 500 మందికిపైగా యువకులు ఈ క్యాంప్ లో పాల్గొన్నారు. ఈ క్యాంప్ లో రక్తదానం చేసిన యువకులందరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు శ్రీహరి, రాష్ట్ర మంత్రి దామోదర్ రెడ్డి, లోక్ సత్తా పార్టీ కన్వినర్ జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications