twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pavitra Lokesh: నరేష్ భార్యకు షాకిచ్చిన పవిత్రా లోకేష్! ఆమెదే హస్తం.. 15 ఛానెల్స్ కి నోటీసులు

    |

    ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు సీనియర్ నటుడు, హీరో వీకే నరేష్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్. వీళ్లిద్దరూ సహాజీవనం చేస్తున్నారన్న పుకార్లు బీభత్సంగా షికార్లు చేశాయి. అయితే వాళ్లిద్దరూ మంచి స్నేహితులు అని చెబుతూ ఓ వీడియో ద్వారా క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. అయితే ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల సమయంలో వీళ్లిద్దరు కలిసి కనిపించేసరికి మళ్లీ ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఇక ఇటీవల హైదరాబాద్ సెబర్ క్రైమ్ పోలీసులకు పవిత్రా లోకేష్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి షాక్ ఇచ్చారు పవిత్రా లోకేష్.

    త్వరలో పెళ్లి..

    త్వరలో పెళ్లి..

    సినీ సెలబ్రిటీల్లో రెండు, మూడు పెళ్లిల్లు, అఫైర్లు సాధారణంగా జరిగే వ్యవహారాలే. అందులో కొన్ని హైలెట్ అయితే మరికొన్ని ఇంకొకరికి తెలియకుండానే కనుమరిగిపోతాయి. అయితే ఇటీవల సినీ హీరోల కంటే మోస్ట్ పాపులర్ గా మారింది సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ రిలేషన్ షిప్. వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని, అందుకోసం పలు ఆలయాలు కూడా చుట్టి వస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

    మీడియా వేదికగా క్లారిటీ..

    మీడియా వేదికగా క్లారిటీ..

    నరేష్, పవిత్రా లోకేష్ కలిసి ఉంటున్నారన్న వార్తలు వస్తున్న సమయంలోనే వాళ్లిద్దరని ఒక హోటల్ లో పట్టుకుని నరేష్ భార్య మూడో భార్య రమ్య మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ వివాదం హైలెట్ గా మారింది. అలాగే నరేష్, పవిత్రా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తాము మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ విషయం తర్వాత వీళ్లిద్దరు వ్యవహారం సద్దుమణిగింది.

    పవిత్రా లోకేష్ ఫిర్యాదు..

    పవిత్రా లోకేష్ ఫిర్యాదు..

    ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు పవిత్రా లోకేష్ ఫిర్యాదు చేయడంతో వీళ్లిద్దరి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. పలు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెళ్లు అభ్యంతరకర వీడియోలు, ట్రోల్స్ చేస్తూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. అయితే అదే ఫిర్యాదులో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ మీడియాకు తెలిపారు.

    విచారణ కొనసాగుతోంది..

    విచారణ కొనసాగుతోంది..

    నరేష్, పవిత్రా లోకేష్ పై అసభ్యకర, అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ల వెనుక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఉన్నట్లుగా పవిత్రా లోకేష్ అనుమానం వ్యక్తం చేసినట్లు ఏసీపీ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఫిర్యాదులో రామారావు, శివకుమారి, రమ్య రఘుపతి పేర్లను పొందుపరిచినట్లు పేర్కొన్నారు. పవిత్రా లోకేష్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

    15 యూట్యూబ్ ఛానెల్స్ కి..

    15 యూట్యూబ్ ఛానెల్స్ కి..

    ముగ్గురి పేర్లను పవిత్రా లోకేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారని, ఇందుకోసం సదరు వ్యక్తులను విచారణ నిమిత్తం హాజరుకావాలని ఆదేశించినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. అయితే ప్రస్తుతానికి రమ్యను మాత్రం విచారణకు పిలవలేదని, అవసరమైతే ఆమెను కూడా విచారిస్తామన్నారు. అంతేకాకుండా పవిత్రా ఫిర్యాదు చేసిన 15 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ నోటీసులు పంపించామన్నారు.

    సీరియస్ యాక్షన్..

    సీరియస్ యాక్షన్..

    యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ కు నోటీసులు పంపిన పోలీసులు మూడు రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని, లేకుంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే సీనియర్ నటుడు నరేష్ మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. రమ్య రఘుపతి మూడో భార్య. 2010లో రమ్యను పెళ్లి చేసుకున్నారు నరేష్. ఆమె కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరి కుమార్తె. ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. వీరిద్దరికి ఇంకా విడాకులు కాలేదన్న విషయం తెలిసిందే.

    English summary
    Pavitra Lokesh Relationship With VK Naresh Rumours Goes Viral And She Complaint On Websites Youtube Channels To Cyber Crime Police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X