హాట్ టాపిక్: పవన్, త్రివిక్రమ్ మళ్ళీ కలిసి...!?
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ జల్సా సమయం నుంచి మంచి స్నేహితులుగా మారారన్న సంగతి తెలిసిందే. అదే అబిమానంతో తన తదుపరి చిత్రం తీన్ మార్ లో కూడా డైలాగులు రాయించాడు. అయితే ఇప్పుడు మళ్ళీ పవన్,త్రివిక్రమ్ కలసి ఏదన్నా ప్రాజెక్టు చేయబోతున్నారా లేక పవన్ తాజా చిత్రం "కాళీ" కి ఏమన్నా రాస్తున్నాడా అనే విషయం పిల్మ్ సర్కిల్స్ లో చర్చగా మారింది. దానికి కారణం రిసెంట్ గా హఠాత్తుగా పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ కలిసి కృష్ణా జిల్లా గన్నవరం ఏయిర్ పోర్ట్ లో కనిపించారు. కేరళలోని పొల్లాచ్చిలో "కాళీ" చిత్రం షుటింగ్ లో ఉన్న పవన్ హఠాత్తుగా త్రివిక్రమ్ ని వెంటేసుకుని రావటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. తీన్ మార్ లో లాగానే త్రివిక్రమ్ సేవలను ఉపయోగించుకుంటన్నాడని,స్క్ర్రిప్టులో మార్పులు కోసం పిలిచాడని అని అంటున్నారు. ఇంతకీ అస్సలు మ్యాటరేంటో..ఇవన్ని ప్రక్కన పెడితే ఊహించని విధంగా తమ అభిమాన హీరో పవన్ కనపడటంతో అభిమానులు ఆనందంతో ఒక్కసారిగా ఆయన్ని చుట్టుముట్టి, షేక్ హ్యాండ్ లు ఇచ్చి ఫోటోలుదిగారు.


Click it and Unblock the Notifications











