Don't Miss!
- News YS Jagan Stone Attack: జగన్ పై దాడి కేసు విచారణ-ఈసీ జోక్యం కోరిన టీడీపీ..!
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘రాంబాబు’ అఫీషియల్ ప్రెస్ నోట్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు'పై అనుమానాలను నివృత్తి చేస్తూ అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజైంది. పవర్ స్టాన్ పవన్ కళ్యాణ్తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూర్య దేవర రాధాకృష్ణ సమర్పణలో యూనివర్శల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' పాట చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలోని సెవెన్ ఎకర్స్ లో నిర్మించిన భారీ సెట్స్లో జరుగుతోంది. ఈ నెల 23తో ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుంది. దీంతో టోటల్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది.
ఈ సందర్భంగా నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ...'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఫెర్ఫార్మెన్స్ హైలెట్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' షూటింగ్ పూర్తయింది. ఈ వారంలోనే ఆడియో రిలీజ్ చేసి వరల్డ్ వైడ్గా ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న అత్యధిక థియేటర్స్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. మణిశర్మ ఈ చిత్రం కోసం అద్భుతమైన ఆడియో ఇచ్చారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ జరుగుతోంది. మా బ్యానర్లో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది' అన్నారు.
పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, నిర్మాణం: యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్య దేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.