Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పంజా నిర్మాతగా మారడానికి కారణం పవన్ కళ్యాణే: నీలిమా
నీలిమ తిరుమలశెట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అరుదైన వ్యక్తి. తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్ది మంది మహిళా నిర్మాతల్లో ఆమె ఒకరు. పంజా సినిమా తీసిన అనుభవము నా జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా నిర్మాణం నాకు బహుమానం లాంటింది మరియు చాలా సంతృప్తినిచింది. కానీ కొంత అలసిపోయం. మాకు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం లభించింది. విష్ణు వర్ధన్ అధ్బుతమైన పనితీరు గల నిపుణులలో ఒకడు. సినిమా బాగా రావడానికి ఆయన ఎంతో కృషి చేసారు అంటున్నారు పంజా నిర్మాత నీలిమా తిరుమల శెట్టి.
ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి కారణం చెబుతూ...పవన్ కళ్యాణ్ గారి వల్లే నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. ఆయన తో కలిసి యువ రాజ్యం (ప్రజా రాజ్యం యువజన విభాగం)లో పని చేయడం జరిగింది. ఆయన నన్ను ఎప్పుడు ప్రోత్సహించే వారు. ఆయన కొత్త గా ఒక సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నపుడు నా భర్త అయిన నగేష్ మరియు శోభు మంచి స్నేహితులు అలా శోభు గారితో కలిసి ఈ సినిమా తీయాలని అనుకున్నాం. విష్ణువర్ధన్ స్క్రిప్ట్ మొత్తం చేపినపుడే పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూపించాలి అనుకున్నాం. ఇంతకముందు చూడని విధంగా పవన్ కళ్యాణ్ గారితో గడ్డంతో ఒక ఫోటో షూట్ చేసాం నచ్చింది. మీకు సినిమా చూసాక అర్ధం అవుతుంది. అంటున్నా నిర్మాత నీలిమా.