twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పంజా నిర్మాతగా మారడానికి కారణం పవన్ కళ్యాణే: నీలిమా

    By Sindhu
    |

    నీలిమ తిరుమలశెట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అరుదైన వ్యక్తి. తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్ది మంది మహిళా నిర్మాతల్లో ఆమె ఒకరు. పంజా సినిమా తీసిన అనుభవము నా జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా నిర్మాణం నాకు బహుమానం లాంటింది మరియు చాలా సంతృప్తినిచింది. కానీ కొంత అలసిపోయం. మాకు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం లభించింది. విష్ణు వర్ధన్ అధ్బుతమైన పనితీరు గల నిపుణులలో ఒకడు. సినిమా బాగా రావడానికి ఆయన ఎంతో కృషి చేసారు అంటున్నారు పంజా నిర్మాత నీలిమా తిరుమల శెట్టి.

    ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి కారణం చెబుతూ...పవన్ కళ్యాణ్ గారి వల్లే నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. ఆయన తో కలిసి యువ రాజ్యం (ప్రజా రాజ్యం యువజన విభాగం)లో పని చేయడం జరిగింది. ఆయన నన్ను ఎప్పుడు ప్రోత్సహించే వారు. ఆయన కొత్త గా ఒక సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నపుడు నా భర్త అయిన నగేష్ మరియు శోభు మంచి స్నేహితులు అలా శోభు గారితో కలిసి ఈ సినిమా తీయాలని అనుకున్నాం. విష్ణువర్ధన్ స్క్రిప్ట్ మొత్తం చేపినపుడే పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూపించాలి అనుకున్నాం. ఇంతకముందు చూడని విధంగా పవన్ కళ్యాణ్ గారితో గడ్డంతో ఒక ఫోటో షూట్ చేసాం నచ్చింది. మీకు సినిమా చూసాక అర్ధం అవుతుంది. అంటున్నా నిర్మాత నీలిమా.

    English summary
    I am a big fan of his and I have worked with him in the operation of Yuvarajyam (Prajarajyam Youth division). He always encouraged me and when he wanted to make a fresh new kind of movie, we decided that we would want to produce it says Panja producer Neelima Thirumalasetty.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X