Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మారుతికి పవన్ కళ్యాణ్ చెక్కు ఇచ్చారు
హైదరాబాద్: బూతు చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న మారుతికి పవన్ కళ్యాణ్ ఓ చెక్కు ఇచ్చారు. ఈ విషయం మారుతి స్వయంగా చెప్పారు. ఆయన రీసెంట్ గా జరిగిన కొత్తజంట ఆడియో పంక్షన్ లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. గతంలోనూ మారుతి తాను పవన్ కి ఓ స్క్రిప్టు రాసుకున్నానంటూ,డైరక్ట్ చేయాలని ఉందంటూ చెప్పిన విషయం తెలిసిందే.
మారుతి మాట్లాడుతూ.. " బన్నీ,నేను మల్టి మీడియా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాం. పవన్ కళ్యాణ్ జానీ చిత్రం లోగో డిజైన్ చేయమన్నప్పుడు నేను పవన్ గారిని కలిసాను. మూడు డిజైన్స్ చూపించాను. వాటిల్లో ఒకటి ఆయన తీసుకుని పదివేల రూపాయల చెక్ ఇచ్చారు. అదే నాకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొదటి రెమ్యునేషన్. ఆయనది గోల్డెన్ హ్యాండ్..అదే నేను దర్శకుడుగా మారటానికి సాయపడింది. నన్ను ఎంకరేజ్ చేసినందుకు ధాంక్యూ సార్ ." అన్నారు.
ఇక గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కొత్త జంట'. ఆడియోని భారీగా,సినీ పెద్దల సమక్షంలో జరపారు. బన్ని వాసు నిర్మాత. అల్లు అరవింద్ సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మారుతి మాట్లాడుతూ... నేను.. నా జీవితం ఇంకేమీ వద్దు. డబ్బుంటేనే జీవితం... అది లేకపోతే ఇంకేమీ లేదు. ఇలాంటి మనస్తత్వం వారిద్దరిదీ. అనుకోకుండా కలుసుకున్నారు.. మనసులు కలుపుకొన్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అలానే ఉన్నాయి. ఆ జంట కథే మా 'కొత్తజంట' అన్నారు . 'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు మారుతి. 'బస్స్టాప్', 'ప్రేమ కథాచిత్రమ్' సినిమాలు విజయాల్ని సాధించాయి. ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న 'కొత్త జంట' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు శిరీశ్ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్లూ, మైనస్లూ నాకు తెలుసు. అతని ప్లస్లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేస్తున్నా అంటున్నారు దర్శక,నిర్మాత మారుతి.
నిర్మాత మాట్లాడుతూ ''ఇద్దరు స్వార్థపరులు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. మారుతి నుంచి వస్తున్న మరో వినోదాత్మక చిత్రమిది. ఈ నెల మూడోవారంలో పాటల్ని విడుదల చేస్తాము. శిరీష్ బాడీలాంగ్వేజ్కు సరిపోయే కథతో, కొత్త లుక్తో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు''అన్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి హిట్..ఖైదీ నెంబర్ 786లోని ఇటు అమలాపురం..అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను...సిల్క్ స్మిత అప్పట్లో చేసింది. మధురిమ, మధు, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, రోహిణి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మారుతి.