Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ మూవీ : వైజాగ్ రైట్స్కేక, రిలీజ్ ఆలస్యమే!
ఈచిత్రాన్ని నిర్మిస్తున్న బివిఎస్ఎన్ ప్రసాద్....దీంతో పాటు గోపీచంద్ సాహసం మూవీని కూడా నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాలను కలిపి రూ. 7 కోట్లు ఉత్తరాంధ్రరైట్స్ అమ్మినట్లు తెలుస్తోంది. ఇందులో సాహసం చిత్రానకి 1 కోటి కాగా, 6 కోట్లు పవన్ మూవీ కోసం చెల్లించారు. రూ. 1 కోటి రీఫండబుల్ అడ్వాన్స్తో అగ్రిమెంట్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఇది ఆల్ టైం రికార్డుగా నిలిచింది.
ఈ మూవీకి రూ. 2 కోట్ల సెట్ వేసారని, కేవలం 5 నిమిషాల సీన్ కోసం ఇంత మొత్తం ఖర్చు చేసారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం....ఇదంతా ఫాల్స్ న్యూసే అని తేలింది.
కాగా...ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ ఈ చిత్రం విడుదల కాస్తం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఆగస్టు చివరి వారంలో గానీ, సెప్టెంబర్ మొదటి వారంలో గానీ ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ యూరఫ్ ఖండంలో సాగుతోంది. ఈచిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.