Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ కళ్యాణ్ బాలీవుడ్ ఎంట్రీ
'గబ్బర్ సింగ్'తో టాలీవుడ్ రికార్డుల్ని తిరిగరాసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీ వరసిద్ధి వినాయక ప్రొడక్షన్స్ ప్రై.లి పతాకంపై కొండ కృష్ణం రాజు నిర్మించే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత కృష్ణంరాజు మాట్లాడుతూ...'పవన్ కళ్యాణ్ బాలీవుడ్లో నటించే తొలి చిత్రం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది బాలీవుడ్ నిర్మాతలు, టాలీవుడ్ నిర్మాతలు ఆయనతో హిందీ చిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయనతో తొలి సినిమా చేసే అవకాశం నాకు రావడం ఓ వరంగా భావిస్తున్నాను అన్నారు.
ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ మూవీగా రూపొందనున్న ఈచిత్రానికి ఇప్పటికే సబ్జెక్టు రెడీ అయిందతీ, హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మాణం అయ్యే అ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అని, అక్టోబర్లో సినిమా ప్రారంభమవుతుందని కృష్ణంరాజు చెప్పారు.
పవన్ కళ్యాణ్-సింగితం శ్రీనివాసరావు కాంబినేషన్లో కొండా కృష్ణం రాజు నిర్మాణంలో ఏస్తుక్రీస్తు ఇతివృత్తంతో కూడిన సినిమా రానుందని ఆ మధ్య వార్తలు వినిపించినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. తాజాగా నిర్మాత కొండా కృష్ణం రాజు పవన్ తో సినిమా తీయబోతున్నట్లు అఫీషియల్గా మీడియాకు వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అయితే ఇది గతంలో చెప్పినట్లు జీసెస్ సినిమానేనా? కాదా? దర్శకుడు ఎవరు? అనేదానిపై నిర్మాత క్లారిటీ ఇవ్వక పోవడంతో అభిమానులు కన్ ఫ్యూజన్లో ఉన్నారు.