Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా పొగరు ఒప్పుకోదు....(పవన్ డైలాగ్స్ అదుర్స్)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' థియేటర్ ట్రైలర్ బుధవారం రిలీజైంది. ఈ ఇందులో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. పొగరు అణచి వేస్తా అని ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగుకు.... నా పొగరు అణచడానికి నువ్వెవరు బే, అందుకు నా పొగరు ఒప్పుకోవాలిగా అంటూ పవన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగుతో పాటు....ఉంచుకోవడానికి ఊయ్యాలూగడానికి మీడియా ఉంపుడుగత్తె కాదంటూ పవర్ స్టార్ చెప్పిన డైలాగులకు కేక పుట్టిస్తున్నాయి.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ తనయుడు అకీరా నందన్ కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో అకీరా తండ్రితో కలిసి ఓ సాంగులో స్టెప్పులు వేసాడని సమాచారం. అక్టోబర్ 18న ఈచిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈచిత్రం గబ్బర్ సింగ్ రికార్డును బ్రేక్ చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు ఆ చిత్ర నిర్మాత డివివి దానయ్య.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.