twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యక్తిగత తిట్లపై పవన్ నిర్ణయం

    By Staff
    |

    Pawan Kalyan
    ఇకపై తాము ఇతర పార్టీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయబోమని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రజల బాగోగులు చూడాల్సిన నేతలు పరస్పరం దూషించుకుంటూ వ్యక్తిగత విమర్శలు చేయటాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు. ఆయన మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు స్పష్టం చేసారు. మహిళారాజ్యం, తెలుగు మహిళానేతలు శోభారాణి, రోజా ఒకరిపై మరొకరు చేసుకున్న వ్యక్తిగత దూషణలు గురించి మీడియా ప్రశ్నించగా..గతంలో తనపై కూడా వ్యక్తిగత విమర్శలు చేశారని ఆయన గుర్తు చేసారు.

    ఈ దూషణలు పర్వానికి ఎవరు తెర లేపిందీ తనకు తెలియదని అన్నారు. ఒకవేళ రెచ్చగొడితే శోభారాణి నోరు జారిందా అనే విషయమై పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ సంఘటనపై స్పందిస్తామన్నారు. మహాకూటమి పార్టీల్లో సఖ్యత లేదని పొత్తు ఏర్పడక ముందు ఒకరిని మరొకరు విమర్శించుకున్న పార్టీలు ఇప్పుడు మహాకూటమిగా ఏర్పడ్డాయన్నారు.వారి వల్ల ప్రజలకు ఏమీ ప్రయోజనం లేదన్నారు. అలాగే వైయస్ పాలన బాగుందని సోనియా గాంధీ కీర్తించటం సబబు గాదని, అవినీతి జరిగిందనే విషయం వారి మనస్సాక్షికి తెలుసన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X