Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నన్ను అవమానించొద్దు, ఎవరైనా చనిపోతే ఇలానే చేస్తారా?: పవన్ కళ్యాణ్
Recommended Video
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలను పూర్తిగా వదిలేస్తున్నట్లు చెప్పిన ఆయన ఇకపై సీరియస్గా రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ సోమవారం అనంతపురంలో పర్యటించారు.
ధర్మవరం చేనేత కార్మికులతో
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ధర్మవరంలోని చేనేత కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను చూసేందుకు అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు.
పవన్ కళ్యాణ్ను చూడటంతో ఆనందంతో అరుపులు
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా అక్కడికి వచ్చినప్పటికీ ఆయనలో ఫ్యాన్స్ తాము అమితంగా అభిమానించే నటుడినే చూశారు. ఆయన్ను చూడగానే ఆనందంతో పరవశించి పోయి అరుపులు, కేకలు వేశారు.
ఇబ్బందికి గురైన పవర్ స్టార్
సమస్యల
గురించి
తెలుసుకోవడానికి
వస్తే
అభిమానులు
అరుపులు,
కేకలు
వేయడంతో
పవన్
కళ్యాణ్
ఇబ్బంది
పడ్డారు.
దీంతో
అసహనానికి
గురైన
ఆయన
వారిని
సుతిమెత్తగా
మందలించారు.
నన్ను అవమానించినట్లే...
మీరు అరుపులు అరిస్తే అది నాకు అవమానం తప్ప సంతోషం కాదు. మీరు నేను చెప్పేది వినాలి. అరుపులకు, కేకలకు, ఉత్సాహానికి ఓ సమయం ఉంటుంది.... అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరైనా చనిపోతే ఇలానే అరుస్తారా?
మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే అరుస్తామా? బాధలతో ఉన్నపుడు వారి బాధలను వినడం నేది సంస్కారం. కొంచెం ఓపికతో, సహనంతో ఉండండి... అంటూ పవర్ స్టార్ హెచ్చరించారు.