Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెగాస్టార్ ఇంటికి పవర్స్టార్ నోరూరించే వేసవి బహుమతి
హైదరాబాద్ : పవర్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి నోరూరించే వేసవి బహుమతి పంపించారు. ఆ బహుమతి మరేదో కాదు...నోరూరించే తాజా మామిడి పండ్లు. ఇవి ఎక్కడో బయట కొని తీసుకొచ్చినవి కాదు... పవన్ కళ్యాణ్కు సంబంధించిన సొంత తోటలో పండించిన అమృత ఫలాలు.
పవన్
కళ్యాణ్
సన్నిహిత
వర్గాల
నుంచి
అందిన
సమాచారం
ప్రకారం...పవన్
ప్రస్తుతం
తన
తోటలో
గడుపుతున్నాడని,
తన
సన్నిహితులకు
రకరకాల
జాతులకు
చెందిన
మామిడి
పండ్లు
పంపుతున్నాడని
తెలుస్తోంది.
గత
సంవత్సరం
కూడా
పవన్
కళ్యాణ్
'గబ్బర్
సింగ్'
యూనిట్
సభ్యులందరికీ
మామిడిపండ్లను
బహుమతిగా
వారి
ఇంటికి
పంపిన
సంగతి
తెలసిందే.
ప్రస్తుతం పవన్ కళ్యాన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత, ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రం తర్వాత 'గబ్బర్ సింగ్ -2' చిత్రం తెరకెక్కనుంది.
'గబ్బర్ సింగ్ -2' చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారు. పవన్ స్నేహితుడు శరత్ మరార్ ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్, ఇతర తారాగణం విషయాలు వెల్లడికానున్నాయి. ఐపీఎల్ యాంకర్ రాచెల్లే రావుతో ఇందులో ఐటం సాంగు చేయిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.