Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జనసైనికుల్లారా సహనం వహించండి.. ఆ ఛానెళ్లను బహిష్కరించండి.. పవన్ పిలుపు
వ్యాపారవేత్త, టీవీ9 అధినేతల్లో ఒకరైన శ్రీనిరాజుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివాదం ముదిరేలా కనపడుతున్నది. ట్విట్టర్ వేదికగా తనపై చేసిన ట్వీట్లను ఆసరాగా చేసుకొని పవన్ కల్యాణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి శ్రీనిరాజు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్లో ధృవీకరించారు.
జనసైనికుల్లారా కొద్దిరోజులు ప్రశాంతంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను. ఎలాంటి విద్వేషపూరిత చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నాను. నాపై శ్రీనిరాజు పరువు నష్టం దావా వేయడానికి సిద్దమవుతున్నాడు. అందువల్ల వివాదాలకు మీరు దూరంగా ఉండాలి. పవర్ ఫుల్ మీడియా అధినేతలతో సుదీర్ఘమైన న్యాయపోరాటానికి సిద్దమవుతున్నాను.
మన తల్లులను, కూతుళ్లను, అక్కాచెల్లెల్లను దూషిస్తున్న టీవీ9, ఏబీఎన్, టీవీ5 లను బహిష్కరించండి. వాళ్లు అశ్లీల వ్యాపారం చేస్తున్నందున వారిని బహిష్కరించాల్సిన అవసరం ఉంది అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.