జనసైనికుల్లారా సహనం వహించండి.. ఆ ఛానెళ్లను బహిష్కరించండి.. పవన్ పిలుపు
వ్యాపారవేత్త, టీవీ9 అధినేతల్లో ఒకరైన శ్రీనిరాజుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివాదం ముదిరేలా కనపడుతున్నది. ట్విట్టర్ వేదికగా తనపై చేసిన ట్వీట్లను ఆసరాగా చేసుకొని పవన్ కల్యాణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి శ్రీనిరాజు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్లో ధృవీకరించారు.
జనసైనికుల్లారా కొద్దిరోజులు ప్రశాంతంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను. ఎలాంటి విద్వేషపూరిత చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నాను. నాపై శ్రీనిరాజు పరువు నష్టం దావా వేయడానికి సిద్దమవుతున్నాడు. అందువల్ల వివాదాలకు మీరు దూరంగా ఉండాలి. పవర్ ఫుల్ మీడియా అధినేతలతో సుదీర్ఘమైన న్యాయపోరాటానికి సిద్దమవుతున్నాను.

మన తల్లులను, కూతుళ్లను, అక్కాచెల్లెల్లను దూషిస్తున్న టీవీ9, ఏబీఎన్, టీవీ5 లను బహిష్కరించండి. వాళ్లు అశ్లీల వ్యాపారం చేస్తున్నందున వారిని బహిష్కరించాల్సిన అవసరం ఉంది అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.



Click it and Unblock the Notifications











