Don't Miss!
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రూ.50 నోటుపై పవన్ చిత్రం.. కేసు
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ చిత్రంతో ఉన్న యాభై రూపాయల నోటును జనసేన పార్టీకి చెందిన ఫేస్బుక్ అకౌంట్లో పోస్టు చేయడంపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ అందింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం.. ఇటీవల పవన్ చిత్రంతో కూడిన యాభై రూపాయల నోటును జనసేనకు చెందిన ఫేస్బుక్ ఖాతాలో పోస్టుచేశారు.
వందేళ్ల క్రితం పవన్ కల్యాణ్ పుట్టిఉంటే.. పచ్చ నోటుపై ఆయన చిత్రాన్ని ముద్రించేవారనే వ్యాఖ్యలు దానికింద ఉన్నాయి. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ ఎల్బీనగర్ చంద్రపురికాలనీకి చెందిన బాలరాజు అనే వ్యక్తి హైకోర్టు న్యాయవాది అరుణ్కుమార్తో కలిసి ఎల్బీనగర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
గాంధీతో పవన్ కల్యాణ్ను పోల్చడమంటే ఆ మహానుభావుడిని కించపరచడమేననీ.. దీనిపై కేసు నమోదుచేయాలంటూ ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
ఇక పవన్ అభిమానులు ఈ విషయమై తమ ఫేస్ బుక్ ఖాతాలలో పోస్ట్ లు పెడుతున్నారు. ఎక్కడ ఈ ఫొటో తో కూడిన న్యూస్ ఉన్నా తీసేమని తమ తోటి అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీడియోలో సైతం ఈ వార్త ప్రముఖంగా రావటంతో చాలా మంది ఈ విషయమై విమర్శలు చేస్తున్నారు.