Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రూ.50 నోటుపై పవన్ చిత్రం.. కేసు
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ చిత్రంతో ఉన్న యాభై రూపాయల నోటును జనసేన పార్టీకి చెందిన ఫేస్బుక్ అకౌంట్లో పోస్టు చేయడంపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ అందింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం.. ఇటీవల పవన్ చిత్రంతో కూడిన యాభై రూపాయల నోటును జనసేనకు చెందిన ఫేస్బుక్ ఖాతాలో పోస్టుచేశారు.
వందేళ్ల క్రితం పవన్ కల్యాణ్ పుట్టిఉంటే.. పచ్చ నోటుపై ఆయన చిత్రాన్ని ముద్రించేవారనే వ్యాఖ్యలు దానికింద ఉన్నాయి. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ ఎల్బీనగర్ చంద్రపురికాలనీకి చెందిన బాలరాజు అనే వ్యక్తి హైకోర్టు న్యాయవాది అరుణ్కుమార్తో కలిసి ఎల్బీనగర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
గాంధీతో పవన్ కల్యాణ్ను పోల్చడమంటే ఆ మహానుభావుడిని కించపరచడమేననీ.. దీనిపై కేసు నమోదుచేయాలంటూ ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
ఇక పవన్ అభిమానులు ఈ విషయమై తమ ఫేస్ బుక్ ఖాతాలలో పోస్ట్ లు పెడుతున్నారు. ఎక్కడ ఈ ఫొటో తో కూడిన న్యూస్ ఉన్నా తీసేమని తమ తోటి అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీడియోలో సైతం ఈ వార్త ప్రముఖంగా రావటంతో చాలా మంది ఈ విషయమై విమర్శలు చేస్తున్నారు.