పవన్ కళ్యాణ్ కు ఎంత గుండె ధైర్యం ఉంటే మరలా అతనితో చేస్తాడా..
ఎదుటివారి మీద జాలి చూపడం అనేది చాలా ప్రమాదమైన చెడ్డ అలవాటు. ఒక్కసారి మనిషి గుండెలోకి దయాగుణం వచ్చిదంటే దానివల్ల అతను అష్టకష్టాలు పడడం సహాజం. సరిగ్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యేసు క్రీస్తు సినిమాతో ఇలానే మారిపోయాడని బాధ పడుతున్నారు ఆయన అభిమానులు. దీనికి కారణం లేకపోలేదు. నెంబర్ స్దానంలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితాన్నే మార్చివేసిన కొమరం పులి దర్సకుడు యస్ జె సూర్యను తమిళ నిర్మాతలు ఛీ కోట్టడంతో ఎక్కడికి పోవాలో అర్దం కాక పాత మిత్రులు అయినటువంటి పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ దగ్గరికి వచ్చి మరలా తనకు ఓ అవకాశం ఇవ్వమని అడిగాడని సమాచారం.
విషయం అర్దం చేసుకున్నటువంటి ప్రిన్స్ మహేష్ తన డేట్స్ ఖాళీగా లెవ్వు అని అనడంతో, పవన్ కళ్యాణ్ మాత్రం సూర్య పట్ల సానుభూతి ప్రకటించి ఏదైనా మంచి కధ ఉంటే తీసుకురమ్మని పంపించాడని సమాచారం. ఇప్పటికే కొమరం పులి దెబ్బకు అభిమానులు బెంబెలెత్తిపోవడంతో మరలా అతనితో సినిమాకు ఎలా పవన్ కళ్యాణ్ సాహాసించాడా అని తలలు పట్టుకుంటున్నారు. ఇది మాత్రమే కాకుండా మొన్న పులి లాంటి డిజాస్టర్ సినిమా ఇచ్చిన సూర్య మాత్రం ఈసారి తన శాయశక్తులు వడ్డి మంచి కధను తయారు చేస్తాడనే ఉధ్దేశ్యంతోనే కరుణామయుడు లాగా అవకాశం ఇచ్చి ఉంటాడని మరికొంత అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











