twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బృందావనం, ఖలేజా సినిమాలకు భయపడుతున్న పవర్ స్టార్..

    By Nageswara Rao
    |

    Pawan Kalyan
    ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసిన అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే. ఎందుకంటే ఆయన నటించిన 'కొమరం పులి' గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోని విడుదలకు సిధ్గంగా వున్న 'కొమరం పులి' ని విడుదల చేయడానికి నిర్మాత దడుస్తున్నాడంట. దీనితో పాటు వరుసగా, మహేష్ బాబు ఖలేజా, జూ ఎన్టీర్ బృందావనం సినిమాలు వుండడమే కారణం అంటున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ చాలా కాలం గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా గనుక ఫట్ అంటే పవన్ కళ్యాణ్ ఇమేజి కూడా దెబ్బతింటుంది. కాబట్టి కొంచం నిదానంగా ముహుర్తం చూసుకోని సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఇది ఇలావుండగా పవన్ కళ్యాణ్ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నేతృత్వంలో ఏసుక్రీస్తు జీవిత కథాంశంతో ఓ బాలల చిత్రం రూపోందనుందనే సంగతీ,అందులో పవన్ కళ్యాణ్ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారనే విషయం మనకు తెలుసు. ఆ చిత్ర ప్రారంభోత్సవాన్ని జెరుసలేంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చి ఫస్ట్ షాట్ క్లాప్ కోట్టమంటూ నిర్మాత కోండా కృష్ణంరాజు పవన్ కళ్యాణ్ ని అభ్యర్ధించడం, పవన్ కళ్యాణ్ అంగాకరించడం జరిగాయట. పవన్ కళ్యాణ్ ఏసుక్రీస్తు జీవిత కథాంశంతో రూపోందుతున్నఈ సినిమా మంచి హీట్ అవ్వాలని కోరుకుందాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X