పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు శుభవార్త.. ఏపీలో విజయంతో జన సైనికులు కాల్ ఎగురేసే న్యూస్!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ఒక్కొక్కటిగా శుభవార్తలు అందుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక గుర్తింపు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులను, సమస్కలను ఎదుర్కొన్నది. తాజాగా ఎన్నికల్లో బంపర్ మెజారిటీతోపాటు భారీగా ఓట్ల శాతాన్ని గణనీయంగా సాధించడంతో ఈ పార్టీకి కొన్ని చిక్కులు తప్పనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేనకు అధికారికంగా పార్టీ చిహ్నం రాలేదు. ప్రతీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ పనిచేయని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు కేటాయించడం ఇతర మిత్రపక్ష పార్టీలకు ఇబ్బందిగా మారేది. అయితే తాజాగా ఎన్నికల్లో విజయంతో అలాంటి సమస్యలకు చెక్ పడేలా కనిపిస్తున్నాయి.

తాజా ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోను 21 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొన్నది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోను దాదాపు 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. దాంతో గణనీయంగా ఓటు బ్యాంకును సొంతం చేసుకొన్నది. దాంతో అధికారిక పార్టీ చిహ్నాం కేటాయింపునకు మార్గం సుగమమైంది.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. శాశ్వత పార్టీ చిహ్నం కావాలంటే... లోక్సభ ఎన్నికల్లో కనీసం 6 శాతం చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 ఎమ్మెల్యేలను, ఒక ఎంపీ సీటు గెలుచుకోవాలి. అయితే తాజా ఎన్నికల్లో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం విశేషంగా మారింది. దాంతో త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











