Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ టీడీపీలో చేరికపై మెగా బ్రదర్ నాగబాబు స్పందన
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు తెలుగు దేశం పార్టీలో చేరుతున్నారనే వార్తలు కేవలం రూమర్లే అని అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. నాగబాబు ఈ వార్తలను స్వయంగా ఖండించారు. మెగా ఫ్యామిలీ పీఆర్ఓ ఎస్కెఎన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఎస్కెఎన్ తన ట్విట్టర్లో పేర్కొంటూ...'మెగా బ్రదర్ నాగబాబు గారు తాను, తన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను స్వయంగా ఖండించారు. తాము ఎవరినీ కలవ లేదని కూడా స్పష్టం చేసారు' అని ట్వీట్ చేసారు. స్టార్ రైటర్ కోన వెంకట్ కూడా ట్విట్టర్లో స్పందిస్తూ...'పవన్ కళ్యాణ్ గురించిన రూమర్లను నమ్మ వద్దు, ఇవన్నీ నిరాధారమైనవి' అని స్పష్టం చేసారు.
కాగా...పవన్ కళ్యాణ్, నాగబాబు తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతుంతోంది. వీరిద్దరూ రహస్యంగా బాలకృష్ణను కలిసారని, పార్టీలో చేరే విషయమై చర్చించారని పుకార్లు షికార్లు చేసాయి. టీడీపీ అగ్రనేత యనుమల రామకృష్ణుడు కూడా.....వారు పార్టీలోకి వచ్చే అవకాశాలను ఖండించలేం, వస్తే ఆహ్వానిస్తాం అని పేర్కొనడం కూడా ఈ రూమర్లకు మరింత బలాన్ని ఇచ్చినట్లు అయింది.
మరో వైపు పవన్ కళ్యాణ్ టీడీపీ కండువాతో ఉన్న ఫోటోలు, బాలకృష్ణను కలిసినట్లు ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. జాతీయ మీడియాలో కూడా ఈ విషయం చర్చనీయాంశం అయింది. తెలుగు న్యూస్ టీవీ చానళ్లు కూడా ఈ రూమర్లకు మరింత మసాలా అద్దడంతో.....రాష్ట్ర మంతటా ఇదో హాట్ టాపిక్ అయింది. తాజాగా నాగబాబు ఖండన, ఎస్కెఎన్ ట్వీట్తో ఈ రూమర్లకు తెర పడినట్లయింది.