Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ కళ్యాణ్ టైటిల్ కే పరిమితం-బాలకృష్ణ ఏకంగా గెటప్ తోనే ...
ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న తెలంగాణవాదులు శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన అనంతరం తమ ఆగ్రహావేశాలు ఎలా ఉంటాయో చూసిస్తామని హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. అంటే మరోసారి తెలంగాణలో జోరుగా నిరసనల పర్వం సాగనుందని తెలుస్తోంది. ఈ నిరసనల సెగలు ముందుగా సినీ పరిశ్రమనే తాకుతాయని, తెలుగు చిత్ర పరిశ్రమకే పెద్ద అడ్డంకిగా మారతాయని గతంలోనే నిరూపితమైంది. దాంతో వచ్చే జనవరి నుంచి మార్చి మధ్య విడుదలయ్యే సినిమాల నిర్మాతలకి ఇప్పట్నుంచే వణుకు మొదలయింది.
ఇప్పటికే కొందరు కెసిఆర్ ను కలుసుకుని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారని వదంతులు కూడా వస్తున్నాయి. ఇదిలావుంటే జనవరి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ సినిమా 'పరమవీర చక్ర"కు కూడా తెలంగాణలో ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో దానిని కౌంటర్ చేయడానికి దాసరి మాస్టర్ ప్లానేసినట్టు సమాచారం.
ఈ చిత్రంలో సినిమా హీరోగా నటిస్తున్న బాలకృష్ణతో ఒక సన్నివేశంలో తెలంగాణ పోరాట యోధుడు 'కొమరం భీమ్" వేషం వేయించారని, తెలంగాణ కీర్తిని చాటిచెబుతూ కొన్ని డైలాగ్స్ పెట్టారని అంటున్నారు. బాలయ్యతో దాసరి ఈ సినిమాలో చాలా మంది గొప్పవాళ్ల గెటప్స్ వేయిస్తున్నారు. అందులో భాగంగా 'కొమరం భీమ్" ది కూడా జత చేశారు. దీని వల్ల 'పరమవీర చక్ర" ని తెలంగాణావాదులు ఉపేక్షిస్తారని, ఒకవేళ సినిమాల ప్రదర్శనకు ఏదైనా అవాంతరం అంటూ ఏర్పడితే ఈ సీన్ తో వాళ్లని కూల్ చేసుకోవచ్చునని దాసరి భావిస్తున్నట్టు టాక్.