గచ్చిబౌలీ స్టేడియంలో జరగనున్న పవన్ 'పంజా' ఆడియో రిలీజ్ వాయిదా..?

By Sindhu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'పంజా" చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకను ఈ నెల 13న గచ్చిబౌలి స్టేడియంలో జరపడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఆడియో వేడుక వాయిదా పడే అవకాశముందనే వార్తలు అందుతున్నాయి.

దీనికి కారణం పవన్ కళ్యాన్ 'పంజా' సినిమాకు సంగీత దర్శకుడుయువన్ శంకర్‌రాజా. యువన్ శంకర్‌రాజా మదర్ జీవా (58) గత సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. టి నగర్ స్వగృహంలో ఉండగా రాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. కనుక ఈ సమయంలో ఆడియో వేడుకను జరపాలా వద్దా అనే సందిగ్ధంలో చిత్ర యూనిట్ ఉన్నారు. కానీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ఈ వేడుకను ఆపొద్దని యువన్ శంకర్ రాజా ఈ యూనిట్ కి చెప్పాడని సమాచారం. యువన్ శంకర్‌ రాజా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు.

మొదట నవంబర్ 13న పవన్ కళ్యాణ్ 'పంజా' ఆడియో రిలీజ్ అనుకున్నారు. లాస్ట్ మినిట్ వర్క్ చాలా వుంటుంది కాబట్టిపై కారణం వలన నవంబర్ 19కు వాయిదా వేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X