Don't Miss!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- News సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే వెళ్ళి కలిసా...వైవియస్ చౌదరి
ప్రస్తుతం వైవియస్ చౌదరి చిరంజీవి మేనల్లుడు ధరమ్ తేజ తో రేయ్...షౌట్ ఆఫ్ సక్సెస్ అనే చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 17 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రంలో హీరోని ఎంపిక చేసిన విధానం వైవియస్ చౌదరి మాటల్లోనే...నేను ఓ రోజు సినిమా ఆఫీసులో స్టోరీ డిస్కషన్స్ జరిపి బయిటకు వస్తూంటే హీరో లక్షణాలున్న ఓ కుర్రాడు క్రికెట్ ఆడుతూ కన్పించాడు. నేను అతన్ని మా సినిమాలో హీరోగా చేస్తావా అని అడిగాను. అతను మా ఫ్యామిలీలో వారే సినిమా ప్లాన్ చే్స్తున్నారని చెప్పాడు. దాంతో ఎవరి అబ్బాయివని అడిగితే చిరంజీవి గారి మేనల్లుడు అని చెప్పారు.
ఆ తర్వాత ఆ కుర్రాడు గురించి పరిశ్రమలో చాలా మందితో డిస్కస్ చేసాను. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి వరకూ వెళ్ళింది. ఆయన నన్ను ఫోన్ చేసి పిలిచారు. వెళ్ళి కలిస్తే. .ఆయన ఈ ప్రపోజల్ పెట్టారు. ఆ తర్వాత చిరంజీవిని కలసి ఒప్పించాము అన్నారు. ఒక్క మగాడు, సలీం వంటి డిజాస్టర్ చిత్రాల వైవియస్ చేస్తున్న చిత్రం ఇది. వైవియస్ చౌదరి ఈ చిత్రాన్ని తన బొమ్మరిల్లు బ్యానర్ పై రూపొందించనున్నారు. ఇక రామ్, ఇలియానాలతో దేవదాసు అనే హిట్ రూపొందించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చౌదరికి ఈ చిత్రం అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతానని వైవియస్ హామీ ఇచ్చి ఒప్పించినట్లు తెలుస్తోంది.