పవన్ నెక్ట్స్ మూడు ప్రాజెక్టులు డిటేల్స్

By Srikanya

ప్రస్తుతం గబ్బర్ సింగ్ బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ వరసగా మూడు చిత్రాలకు కమిటయ్యారు. ఆ చిత్రాల్లో మొదటిది పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రెడీ అయ్యేది. ఈ చిత్రం మే నెల నుంచి మొదలవుతుందని పూరీ జగన్నాధ్ స్వయంగా ట్వీట్ చేసారు. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తారు. దసరాకు ఈ చిత్రం విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఆ చిత్రం తర్వాత రియలెన్స్ వారు నిర్మాత బివివియస్ ఎన్ ప్రసాద్ తో టై అప్ అయ్యి చేస్తున్న చిత్రం చేస్తారు. ఆ చిత్రాన్ని రాజు సుందరం డైరక్ట్ చేస్తారు. కామీడి ఎంటర్టైనర్ గా గమ్మత్తైన కథతో ఆ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.

పవన్,పూరీ కాంబినేషన్ చిత్రం విడుదల అయ్యాకే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం ప్రారంభమవుతుంది. పంజా నిర్మించిన సంఘమిత్రా ఆర్క్ బ్యానర్ పై ఆ చిత్రం మొదలవుతుంది. సరదా టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఇక గబ్బర్ సింగ్ చిత్రం ఏప్రియల్ 27న విడుదల చేస్తారు. హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రం దబాంగ్ రీమేక్ గా రూపొందుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X