twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్ కోసం పవన్ కళ్యాణ్ త్యాగం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో ఫంక్షన్ రద్దయింది. పవన్ నిర్ణయం మేరకు ఆడియో ఫంక్షన్ రద్దు చేసారని తెలుస్తోంది. ఆడియో ఫంక్షన్ నిర్వహించి అనవసరంగా నిర్మాతకు భారం పెంచొద్దనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ మేరకు త్వరలో ఆడియోను డైరెక్టుగా మర్కెట్ లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    దీంతో పాటు మరో కారణం కూడా వినిపిస్తోంది. పవన్ తన సినిమా ఆడియో వేడుక రద్దు చేసుకుని, ఆ సమయాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న మరో చిత్రం 'సాహసం' చిత్రం ప్రమోషన్ కోసం కేటాయించాడని తెలుస్తోంది. గోపీచంద్, తాప్సి హీరో హీరోయిన్లుగా సాహసం చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

    అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ నిమిత్తం నెలరోజుల క్రితం యూరప్ వెళ్లిన పవన్ షెడ్యూల్ ముగియడంతో హైదరాబాద్ తిరిగి వచ్చారు. యూరప్ షెడ్యూల్‌లో పాటల చిత్రీకరణతో పాటు, కొన్ని సీన్స్ షూట్ చేసారు. స్పెయిన్‌లోని ఐస్‌లాండ్‌లో పవన్ కళ్యాణ్, వంశీ(ఒక విచిత్రం హీరో)లపై ప్రత్యేకమైన ఫైట్ సీన్ చిత్రీకరించారు. ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా చాపర్లను వాడారు. ఈ ఫైట్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో చిత్రీకరించారు.

    స్పెయిన్‌లోని మిలన్ నుంచి హైదరాబాద్ బయల్దేరిన యూనిట్ సభ్యులు మంగళవారం తెల్లవారు ఝామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. జులై 4వ తేదీ నుంచి నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అన్పపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లో పవన్ కళ్యాణ్, సమంత మరికొందరితో కలిపి పాటను చిత్రీకరించబోతున్నారు.

    English summary
    
 Pawan Kalyan has cancelled the audio function of his next release under Trivikram direction and allotted the time for the promotion of Sahasam which is produced by BVSN.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X