Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గోపీచంద్ కోసం పవన్ కళ్యాణ్ త్యాగం!
దీంతో పాటు మరో కారణం కూడా వినిపిస్తోంది. పవన్ తన సినిమా ఆడియో వేడుక రద్దు చేసుకుని, ఆ సమయాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న మరో చిత్రం 'సాహసం' చిత్రం ప్రమోషన్ కోసం కేటాయించాడని తెలుస్తోంది. గోపీచంద్, తాప్సి హీరో హీరోయిన్లుగా సాహసం చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ నిమిత్తం నెలరోజుల క్రితం యూరప్ వెళ్లిన పవన్ షెడ్యూల్ ముగియడంతో హైదరాబాద్ తిరిగి వచ్చారు. యూరప్ షెడ్యూల్లో పాటల చిత్రీకరణతో పాటు, కొన్ని సీన్స్ షూట్ చేసారు. స్పెయిన్లోని ఐస్లాండ్లో పవన్ కళ్యాణ్, వంశీ(ఒక విచిత్రం హీరో)లపై ప్రత్యేకమైన ఫైట్ సీన్ చిత్రీకరించారు. ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా చాపర్లను వాడారు. ఈ ఫైట్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో చిత్రీకరించారు.
స్పెయిన్లోని మిలన్ నుంచి హైదరాబాద్ బయల్దేరిన యూనిట్ సభ్యులు మంగళవారం తెల్లవారు ఝామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. జులై 4వ తేదీ నుంచి నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అన్పపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లో పవన్ కళ్యాణ్, సమంత మరికొందరితో కలిపి పాటను చిత్రీకరించబోతున్నారు.