Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
పవన్ కళ్యాణ్ బుల్లితెర షో, సత్యమేవ జయతే తరహాలో.. షూటింగ్ ఎప్పుడంటే!
అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయ కార్యక్రమాలపై దృష్టి పెట్టాడు. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సామజిక సమస్యలపై తన స్పందిన తెలియజేస్తూ వచ్చాడు. ఇటీవల ఓ మీడియా సంస్థ నుంచి పవన్ కళ్యాణ్ కు ఓ ప్రతిపాదన వచ్చింది. సామజిక సమస్యల్ని హైలైట్ చేసే బుల్లి తెర షోకు హోస్ట్ గా వ్యవహరించాలని కోరారు.
ఈ ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన సత్యమేవ జయతే తరహాలో ఈ షో సాగనుందని ప్రచారం జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రలో తీవ్రంగా ఉన్న సమస్యల్ని పవన్ కళ్యాణ్ ఈ షో ద్వారా హైలైట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఆసక్తిరేపుతున్న బుల్లితెర కార్యక్రమం సెప్టెంబర్ నుంచి షూటింగ్ జరుపుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సామజిక సమస్యలతో కార్యక్రమం నిర్వహిస్తే అది సంచలనమే అవుతుంది.