సినిమాలతో మార్పు రాదు.. చిరంజీవికి ద్రోహం.. వాళ్లకును చెప్పుతో కొట్టినట్లు.. పవన్ కల్యాణ్
Recommended Video

జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నడుం కట్టారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో బుధవారం ఆయన పర్యటిస్తున్నారు. వైజాగ్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఆవేశంగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన విషయాలు ఆయన మాటల్లోనే..

సత్యగ్రహి కథ రాసుకొన్నా..
ప్రజా సమస్యలు, ప్రజా సంక్షేమాన్ని కాలరాస్తున్న ప్రభుత్వాలపై పోరాటం చేసే అంశాలతో సత్యాగ్రహి అనే కథ రాసుకొన్నాను. కానీ సినిమాగా తీయకూడదు అని అనుకొన్నాను. నేను ఓ సత్యాగ్రహి కాకూడదు అని అనుకొన్నాను.

సినిమాలతో సాధ్యం కాదు..
సినిమాల వల్ల ఆచరణ సాధ్యం కాదు. వ్యవస్థలు మారవు. అందుకే నిజజీవితంలో నేను సత్యాగ్రహిగా మారడానికి సిద్ధపడ్డాను. 2003లో రాజకీయాల్లోకి రావాలని అమ్మా, నాన్న, అన్నయ్య చిరంజీవికి చెప్పాను.

సినిమాల్లో నాకు ఆనందం లేదు
సినిమాలు విజయం సాధిస్తుంటే నాకు ఆనందం లేదు. ప్రజలకు సేవ చేయాలనే కోరిక రోజు రోజుకు బలంగా మారింది.

సినిమాలకు జైకొట్టేవాళ్లు..
నా సినిమాలకు జైకొట్టే వాళ్లు నా వెంట రాకూడదు. నా ఆలోచన శక్తి అనుగుణంగా ఉన్న కార్యకర్తలే నా వెంట నడువాలి. రాజకీయాల్లో చిరంజీవికి అన్యాయం చేసిన వాళ్లను చెప్పుతో కొట్టాలి. అది చిరంజీవికి తలపెట్టిన ద్రోహం కాదు. ఓ మంచి ఆదర్శాలు కలిగిన పార్టికీ తలపెట్టిన ద్రోహం.

మార్షల్ ఆర్ట్స్ అందుకే
నాలో ధైర్యాన్ని పెంచుకొనేందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొన్నాను. నాలోని గర్వాన్ని అణిచివేసుకొన్నాను. నేను అనే పదాన్ని కేవలం ప్రజా ఉద్యమాల్లోనే వాడుతాను. నాలోని అహంకారాన్ని తీసివేశాను.


Click it and Unblock the Notifications











