Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
యూత్లో దమ్ము లేదు, విభజన అందుకే: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: యువతలో ప్రశ్నించే దమ్ము తగ్గిందని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న ఆయన ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. కేవలం ఒక్క తరం చేసిన తప్పుతో రాష్ట్రం రెండు ముక్కలయిందని ఆయన విమర్శించారు. యువత ప్రశ్నించక పోవడం వల్లనే ఈ పరిస్థితి సంభవించిందన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, పత్రి ఒక్కరూ చైతన్యంతో ముందడుగు వేయాలని ఆయన కోరారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
మంగళవారం ఉదయం జిల్లాలోని రాజాం చేరుకున్న ఆయన అక్కడి జిఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రి, నైరెడ్, జీఎంఆర్ ఐటీలను సందర్శించారు. కేర్ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు. అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం నైరెడ్ లో స్వయం ఉపాధిపై శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.
స్లైడ్ షోలో ఫోటోలు, వివరాలు
ఆసుపత్రి సందర్శన
జిఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రిని పవన్ కళ్యాణ్ సందర్శించారు.
స్వచ్ భారత్
రాజాంలో జరిగిన స్వచ్ భారత్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
స్వయం ఉపాది
నైరెడ్ లో స్వయం ఉపాధిపై శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు.
అభిమానులు
పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.
యువతలో ప్రశ్నించే దమ్ము తగ్గిందని
యువతలో ప్రశ్నించే దమ్ము తగ్గిందని సినీ నటుడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న ఆయన ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. కేవలం ఒక్క తరం చేసిన తప్పుతో రాష్ట్రం రెండు ముక్కలయిందని ఆయన విమర్శించారు.